యాప్నగరం

ఎన్నికల వేళ కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా సుశీల్ చంద్ర

త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్రను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 14 Feb 2019, 6:06 pm
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్రను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సుశీల్ చంద్ర నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం (ఫిబ్రవరి 14) ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నికల కమిషనర్‌గా చెలామణిలోకి వస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Samayam Telugu sunil


సుశీల్ చంద్ర ప్రస్తుతం.. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన 1980 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఆదాయ పన్ను విభాగం)కు చెందిన అధికారి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తయారీలో సుశీల్ చంద్ర కీలక పాత్ర పోషించారు.

సుశీల్ చంద్ర కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియామితులైనట్లు ఇన్‌కమ్ టాక్స్ విభాగం జాయింట్ కమిషనర్ సత్య పినిశెట్టి ట్వీట్ ద్వారా వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.