యాప్నగరం

మనీలాండరింగ్ కేసులో కార్తీ చిదంబరం అరెస్ట్

​ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించారనే కారణంతో మనీలాండరింగ్ కేసులో మంగళవారం రాత్రి చెన్నైలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

TNN 28 Feb 2018, 11:23 am
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించారనే కారణంతో మనీలాండరింగ్ కేసులో మంగళవారం రాత్రి చెన్నైలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రంలోగా విచారణ నిమిత్తం ఆయన్ను ఢిల్లీ తీసుకెళ్లనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అధికారులు కార్తీ చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో చార్టెర్డ్ అకౌంటెంట్‌‌ను కూడా సీబీఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేయగా.. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
Samayam Telugu cbi arrests karti chidambaram in inx media money laundering case
మనీలాండరింగ్ కేసులో కార్తీ చిదంబరం అరెస్ట్

ఐఎన్ఎక్స్ కేసులో కార్తీ చిదంబ‌రానికి సంబంధం ఏమిటి?​

ఐఎన్‌ఎక్స్ మీడియా పెట్టుబడుల్లో అవకతవకాలు జరిగాయని గత ఏడాది మే నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండగా.. 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియాలో రూ. 300 కోట్ల మేర విదేశీ పెట్టుబడుల విషయంలో నిబంధనల్ని ఉల్లంఘించారని ఈడీ అనుమానిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా చెల్లింపుల విషయంలో కార్తీ చిదంబరం, ఇతరులపై సీబీఐ ప్రత్యేకంగా కేసులు నమోదు చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా కార్తీ చిదంబరం ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.