యాప్నగరం

అవినీతి కేసులో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈడీ అరెస్ట్

సీబీఐ అధికారులు ఓ అవినీతి కేసులో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈడీని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి లంచం తీసుకుని.. వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా ఈడీ నివాసంలో సోదాలు నిర్వహించారు. లక్షలాది రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 7 Jul 2022, 6:03 pm
Samayam Telugu అవినీతి కేసులో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈడీ అరెస్ట్
ఓ ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బీఎస్ ఝా, టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ వీపీ దేశరాజ్ పాఠక్, అసిస్టెంట్ వీపీ ఆర్‌ఎన్ సింగ్ సహా ఐదుగురు అధికారులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఝా ప్రస్తుతం ఇటానగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

అక్రమ చెల్లింపులకు ప్రతిఫలంగా ఝా వివిధ ప్రాజెక్టుల్లో ఓ ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అధికారులు ఆరోపించారు. ఈ మేరకు అధికారులు ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ మేరకు గురుగ్రామ్‌లోని బీఎస్‌ ఝా ఇంట్లో రూ.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివిధ పనుల నిర్వహణకు ప్రైవేట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ల నుంచి ఝా లంచాలు తీసుకుంటున్నట్టు సమాచారం అందిందని, అందుకే సీబీఐ అతనిపై నిఘా ఉంచిందని వారు తెలిపారు.

ఏజెన్సీ బృందాలు బుధవారం అక్రమంగా చెల్లింపులు జరుపుతున్న ప్రదేశానికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముడుపులు స్వీక‌రిస్తున్న ఝాను రెడ్ హ్యాండెడ్‌గా సీబీఐ అధికారులు ప‌ట్టుకున్నారు. అరెస్టైన ఆరుగురు నిందితులను గురువారం పంచకుల కోర్టులో హాజరుపరచనున్నట్టు వారు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.