యాప్నగరం

కార్తీ చిదంబరంపై మరో కేసు నమోదు.. ఎంపీ నివాసం, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు

CBI Karti Chidambaram | కేంద్ర మాజీ మంత్రి తనయుడు, ఎంపీ కార్తీ చిదంబరంపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. చైనీయులకు వీసాలు ఇప్పించడం కోసం రూ.50 లక్షలు తీసుకున్నారనే అభియోగాలతో కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా కార్తీ చిదంబరం ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టింది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 17 May 2022, 11:31 am

ప్రధానాంశాలు:

  • కార్తీ చిదంబరం నివాసం, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు
  • కాంగ్రెస్ ఎంపీపై కేసు నమోదు
  • ఇప్పటికే ఓ కేసును ఎదుర్కొంటున్న కార్తీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu CBI books Congress leader Karti Chidambaram over illegal gratification
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కార్తీపై.. చైనీయులకు వీసా ఇచ్చేందుకు రూ.50 లక్షలు తీసుకున్నారనే అభియోగాలతో మరో కేసు పెట్టారు. 2010-14 మధ్య పవర్ ప్రాజెక్ట్ కోసం 250 మంది చైనీయులకు వీసా ఇప్పించడం కోసం కార్తీ రూ.50 లక్షలు లంచం తీసుకున్నారనే అభియోగంపై కొత్త కేసు నమోదైందని సమాచారం.
కార్తీ లావాదేవీలను పరిశీలించిన సీబీఐ.. చైనీస్ వర్కర్లకు వీసా మంజూరు చేయించినందుకు గానూ రూ.50 లక్షల నగదు ఆయన ఖాతాలోకి మళ్లినట్లు గుర్తించింది. దీని ఆధారంగా చెన్నై‌లోని మూడు ప్రదేశాలు, ముంబైలోని మూడు ప్రదేశాలు, కర్ణాటక, ఒడిశా, పంజాబ్‌ల్లో ఒక్కో ప్రదేశంలో సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు.

ఢిల్లీలోని 80 లోధి ఎస్టేట్‌లోని చిదంబరం నివాసంలో సీబీఐ సోమవారం ఉదయం దాడులు చేసింది. ఎంపీ నివాసంలో ఉన్న సిబ్బందిని ప్రశ్నించిన సీబీఐ.. కొన్ని పత్రాలను తమ వెంట తీసుకెళ్లింది.

‘సీబీఐ బృందంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఉదయం 7.30 గంటలకు సోదాలు జరిగిన సమయంలో కార్తీ చిదంబరం ఇంట్లో లేరు’ అని సెక్యూరిటీ గార్డ్ బీర్బల్ సింగ్ తెలిపారు. కార్తీ నివాసం, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది.

ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బిల్లు (ఎఫ్ఐపీబీ) గ్రాంట్ విషయంలో నిబంధనలను పాటించలేదనే కారణంతో 2017లో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఆయన తనయుడు కార్తీ నివాసంలో సీబీఐ సోదాలు జరిపింది. చెన్నైలోని చిదంబరం నివాసం సహా 17 ప్రాంతాల్లో సీబీఐ దాడులు చేసింది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.