యాప్నగరం

Drug Trafficking ఇంటర్‌పోల్‌తో కలిసి సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’... ఇక డ్రగ్స్ ముఠాలకు చుక్కలే!

గతవారం చిన్నారుల అశ్లీల వీడియోలు, కంటెంట్‌ను వ్యాప్తి చేస్తోన్న సైబర్ నేరగాళ్ల పని పట్టేందుకు ఆపరేషన్ మేఘ చక్ర పేరుతో సీబీఐ దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 59 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తాజాగా, డ్రగ్స్ ముఠాల ఆటకట్టించేందుకు ఇంటర్ పోల్‌తో కలిసి ఆపరేషన్ చేపట్టింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలను నిలువరించి, దేశంలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని సీబీఐ తాజాగా ప్రకటన చేసింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 29 Sep 2022, 2:51 pm

ప్రధానాంశాలు:

  • అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలపై దాడులు
  • ఇంటర్‌పోల్ సహకారం తీసుకున్న సీబీఐ
  • పలు రాష్ట్రాల్లో మొత్తం 175 మంది అరెస్ట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సీబీఐ
దేశవ్యాప్తంగా ఆపరేషన్ గరుడ (Operation Garuda) పేరుతో సీబీఐ (CBI) సోదాలు నిర్వహిస్తోంది. మాదకద్రవ్యాల (Drugs) అక్రమ రవాణా ముఠాలపై చర్యల్లో భాగంగా ఇంటర్‌పోల్ (Interpol) సహకారంతో ఈ సోదాలను సీబీఐ నిర్వహిస్తోంది. డ్రగ్స్ ముఠాలకు చెందిన 170 మందిని ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసి, పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ ప్రకటించింది. మొత్తం 125 కేసులు నమోదుచేసినట్టు తెలిపింది.
పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్ర సహ పలు రాష్ట్రాలు పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులతో కలిసి ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టినట్టు పేర్కొంది. మొత్తం 6,600 అనుమానితులను తనిఖీ చేసినట్టు చెప్పింది. పరారీలో ఉన్న ఆరుగురు నిందితులు సహా దాదాపు 175 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. భారీ మొత్తంలో మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.

‘‘మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై క్రిమినల్ ఇంటెలిజెన్స్ వేగవంతమైన మార్పిడి.. ఇంటర్‌పోల్ ద్వారా అంతర్జాతీయ అధికార పరిధిలో సమన్వయంతో కూడిన చట్టాన్ని అమలు చేయడం ద్వారా అంతర్జాతీయ అనుసంధానాలతో డ్రగ్స్ నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయడానికి ఈ ఆపరేషన్ ప్రయత్నిస్తుంది’’ అని ప్రకటనలో సీబీఐ వివరించింది.

‘‘ఇంటర్‌పోల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సన్నిహిత సమన్వయంతో ఈ అంతర్జాతీయ ఆపరేషన్ ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి, డ్రగ్స్,సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడం ప్రారంభించాం.. అంతర్జాతీయ అనుసంధానంతో డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లకు అంతర్జాతీయ అధికార పరిధిలో చట్టం అమలకు సహకారం అవసరం’’ అని పేర్కొంది.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.