యాప్నగరం

సీబీఎస్ఈ టాపర్‌పై సామూహిక అత్యాచారం

చదువే లోకంగా భావిస్తూ, చక్కని భవిష్యత్తు కోసం కలలుగంటున్న ఆ అమ్మాయిపై కామాంధుల కన్నుపడింది. ఒంటరిగా ఉన్న ఆమెను పొలాల్లోకి తీసుకెళ్లి పసువుల్లా మీదపడి అత్యాచారానికి పాల్పడ్డారు.

Samayam Telugu 14 Sep 2018, 6:43 pm
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన 19 ఏళ్ల యువతిని అపహరించడమే కాకుండా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని మహేంద్రగడ్‌లో కానినా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu Untitledqqwa


పంచాకులా ప్రాంతంలో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన బాధితురాలు, ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. బుధవారం కొందరు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి, ఝగ్గర్ ప్రాంతంలోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం మత్తు మందు కలిపిన పానీయం తాగించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులంతా తమ గ్రామానికి చెందినవారేనని బాధితురాలు తెలిపింది. స్పృహ కోల్పోయిన తనను కనినా ప్రాంతంలోని బస్టాప్ వద్ద వదిలి పారిపోయారని పేర్కొంది. పోలీసులు ఈ కేసులో నయాగావ్ ప్రాంతానికి చెందిన పంకజ్, మనీష్, నిషు అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.