యాప్నగరం

అది బాబా రూపమే అంటున్న భక్తులు!

బాబా రూపం కనిపించిందంటూ కర్ణాటక రాష్ట్రంలోని హన్సూర్‌లోని ఒక ఆలయానికి భక్తులు పోటెత్తారు.

TNN 1 Mar 2017, 5:09 pm
బాబా రూపం కనిపించిందంటూ కర్ణాటక రాష్ట్రంలోని హన్సూర్‌లోని ఒక ఆలయానికి భక్తులు పోటెత్తారు. సాయిబాబా రూపంలా ఒక దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అందులో సాయిబాబా విగ్రహం ముందు.. నిలబడి ఉన్నట్లు వెలుతురు లాంటి ఒక రూపం కనిపిస్తోంది. ఈ వార్త బయటికిరాగానే ఆ ఆలయానికి భక్తులు వరసబెట్టారు. కానీ సాయిబాబాను నేరుగా ఎవ్వరూ చూడలేదు.
Samayam Telugu cctv footage it is sai baba says devotees
అది బాబా రూపమే అంటున్న భక్తులు!


స్థానికి ఎమ్మెల్యే మంజునాథ ట్రస్టీగా ఉన్న ఈ దేవాలయానికి.. సుధాన్వ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రోజూలానే సీసీటీవీ ఫుటేజ్‌లను పరీక్షిస్తుండగా ఈ అరుదైన రూపం కనిపించినట్లు ఆయన చెబుతున్నారు. కానీ భక్తులు అది సాయిబాబా రూపమే అని విశ్వసిస్తున్నారు. ఇదంతా దేవాలయానికి పేరు రావాలని.. కావాలనే ప్రణాళికతో చేశారనే విమర్శలు రావడంతో.. వాటిని ఎమ్మెల్యే ఖండించారు. ‘సాంకేతికంగా గమనిస్తే.. అది ఒక వెలుగులా కనిపిస్తోంది. ఇందులో ఎలాంటి గ్రాఫిక్స్ లేవు’ అని ఆయన వివరణ ఇచ్చారు.

మైసూరు జిల్లా పరిషత్ సభ్యులైన పుష్పా అమరనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను సైన్స్ విద్యార్థినే అయినప్పటికీ.. ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాను. భక్తులు అది బాబా రూపమే అంటున్నారు. నాస్తికులు.. కాదూ.. అది ఒట్టి వెలుగే అంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.