యాప్నగరం

విమాన స‌ర్వీస్‌ల‌పై కేంద్రం క్లారిటీ.. ఆ త‌ర్వాతే స‌ర్వీస్‌లు ప్రారంభం!

క‌రోనా వైర‌స్‌ను అడ్డుకోవాల‌నే క్ర‌మంలో ప్ర‌పంచవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌జా, ప్రైవేట్ ర‌వాణాను ప్ర‌భుత్వాలు నిషేధించాయి. ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

Samayam Telugu 18 Apr 2020, 11:58 pm
ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చేనెల 3 త‌ర్వాత ఈ లాక్‌డౌన్ కొన‌సాగించ‌డంపై స్ప‌ష్ట‌త రానుంది. అయితే ఏయిర్ ఇండియా, ఇండిగో లాంటి సంస్థ‌లు వ‌చ్చేనెల‌లో దేశీయ విమాన స‌ర్వీసుల‌ను ప్రారంభిస్తామ‌ని తాజాగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌తనిచ్చింది. విమాన ప్ర‌యాణాల‌పై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాతే ఏయిర్‌లైన్స్ సంస్థ‌లు బుకింగ్స్ ప్రారంభించాల‌ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరి తెలిపారు.
Samayam Telugu New Delhi: Union Civil Aviation Minister Hardeep Singh Puri during ongoing Budge...
Union Civil Aviation Minister Hardeep Singh Puri


Must Read: రైతన్న మంచి మనసు.. పేదలకు రూ.50 లక్షల సరుకులు అందజేత

ఇప్ప‌టివ‌ర‌కైతే త‌మ మంత్రిత్వ‌శాఖ విమాన ప్ర‌యాణాల‌పై ఎలాంటి నిర్ణ‌యాల‌ను తీసుకోలేద‌ని మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరి తెలిపారు. మ‌రోవైపు వ‌చ్చేనెల 4 నుంచి దేశీయ విమాన ప్ర‌యాణాలను ప్రారంభించేందుకుగాను ఇప్ప‌టికే ఏయిర్ ఇండియా బుకింగ్స్‌ను ప్రారంభించింది. అలాగే జూన్ నుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీస్‌ల‌ను ప్రారంభించేందుకు స‌న్నాహ‌కాలు చేస్తోంది.

Must Read: షాకింగ్.. ఢిల్లీలో ఒకే కుటుంబంలో 26 మందికి కరోనా

మ‌రోవైపు మ‌న‌దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా విస్తరిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 15,700కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 520 మంది మ‌ర‌ణించారు. ఇక లాక్‌డౌన్ తొలి విడ‌త‌ను మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కు విధించిన సంగ‌తి తె లిసిందే. అనంత‌రం ఈనెల 14 నుంచి మే 3వ వ‌ర‌కు రెండో విడ‌త లాక్‌డౌన్‌ను పొడిగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.