యాప్నగరం

గుడ్ న్యూస్.. కనీస వేతనం రూ. 21 వేలు?

కనీస వేతనాన్ని ఇటీవలే రూ. 18 వేలకు పెంచిన కేంద్రం... దాన్ని మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

TNN 5 Sep 2017, 3:13 pm
ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. మోదీ సర్కారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాలను పెంచే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఏడో వేతన సంఘం నివేదిక ప్రకారం కనీస వేతనాన్ని రూ. 21 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం కింది స్థాయి ఉద్యోగులకు అందిస్తోన్న కనీస వేతనం రూ. 18 వేలు ఉండగా.. మరో మూడు వేల రూపాయలు పెంచున్ననట్లు తెలుస్తోంది. కాగా, కనీస వేతనాన్ని రూ. 25 వేలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Samayam Telugu central govt employees likely to get hike in minimum pay to rs 21000
గుడ్ న్యూస్.. కనీస వేతనం రూ. 21 వేలు?


ఏడో వేతన సంఘం సిఫారసులకు కొన్ని మార్పులు చేసిన కేబినెట్ గత జూన్లో ఆమోదం తెలిపింది. అప్పుడే కనీస వేతనాన్ని రూ. 18 వేలకు పెంచింది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం వల్ల 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. జూలై 1 నుంచి వేతన సంఘం సిఫారసుల ప్రకారం పెంచిన అలవెన్సులు అమల్లోకి వచ్చాయి. ఉద్యోగ సంఘాలు 3.68 ఫిట్‌మెంట్‌ను డిమాండ్ చేస్తుండగా.. తొలుత 2.7 ఫిట్‌మెంట్‌కు అంగీకరించిన కేంద్రం దాన్ని 3కు పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.