యాప్నగరం

కొత్త రకం కరోనా వైరస్‌పై కేంద్రం అలర్ట్‌గా ఉంది: ఆరోగ్య మంత్రి

UK Coronavirus: యూకేలో వ్యాప్తి చెందుతున్న కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ తెలిపారు. ఆందోళన అవసరం లేదన్నారు.

Samayam Telugu 22 Dec 2020, 12:48 pm
యూకేలో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ పట్ల ప్రపంచదేశాలు బెంబేలెత్తుతున్నాయి. అయితే.. ఈ కొత్త రకం కరోనా వైరస్‌ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా ఏటా డిసెంబరు 22న నిర్వహించే ‘ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌-2020’ ప్రారంభిస్తూ.. మీడియాను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి హర్షవర్ధన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu కరోనా వైరస్
New Coronavirus Strain


‘కొవిడ్ మహమ్మారిపై భారత ప్రజలు చేసిన పోరాటం మనదేశ సహనశక్తికి నిదర్శనంగా నిలిచింది. కరోనాను ఎదుర్కొనే విషయంలో భారత్‌ మెరుగైన పనితీరును కనబరిచింది. ఇదంతా మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైంది’ అని మంత్రి హర్షవర్ధన్ అన్నారు.

కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి అంశంపై చర్చిండానికి కేంద్ర ప్రభుత్వం సోమ‌వారం అత్యవసర స‌మావేశం ఏర్పాటు చేసింది. మరోవైపు.. యూకే నుంచి వచ్చే విమానాలపై భారత్ నిషేధం విధించింది. డిసెంబర్ 31 వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.

Also Read: బ్రిటన్‌లో కొత్త వైరస్.. భారత్ ఎమర్జెన్సీ మీటింగ్, పలు దేశాల్లో విమానాలు రద్దు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.