యాప్నగరం

విగ్రహాల కూల్చివేతలను తీవ్రంగా ఖండించిన ప్రధాని!

గత కొన్ని రోజులుగా త్రిపుర, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ప్రముఖుల విగ్రహాల కూల్చివేత ఘటనలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.

TNN 7 Mar 2018, 12:19 pm
గత కొన్ని రోజులుగా త్రిపుర, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ప్రముఖుల విగ్రహాల కూల్చివేత ఘటనలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రముఖుల విగ్రహాలు కూల్చివేతపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడిన మోదీ, వీటిపై సరైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీంతో కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారి పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేసే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, వీటిపై రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు’ అంటూ కేంద్ర హోం శాఖ తెలిపింది.
Samayam Telugu centre asks states to take strong action against vandalism of statues
విగ్రహాల కూల్చివేతలను తీవ్రంగా ఖండించిన ప్రధాని!


మంగళవారం దక్షిణ త్రిపురలో కమ్యూనిస్ట్ దిగ్గజం లెనిన్ విగ్రహాలు, తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో రామస్వామి పెరియర్ విగ్రహాన్ని దుండగలు ధ్వంసం చేశారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని కోల్‌కతాలో బుధవారం కూల్చివేతకు కొందరు ప్రయత్నించారు. అయితే దీన్ని పోలీసులు భగ్నం చేసి, ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. త్రిపురలోని బెలోనియా పట్టణంలో లెనిన్ విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలే కూల్చేశారని సీపీఎం జిల్లా కార్యాదర్శి తపస్ దత్తా ఆరోపించారు. ఈ ఘటనపై తృణ‌మూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ... బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తులే విగ్రహాలను కూల్చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ ట్వీట్ కూడా పెద్ద దుమారమే రేపింది. ‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం చేసిన పనిని... ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన మరో ప్రభుత్వం రద్దుచేయవచ్చు’అంటూ చేసిన ట్వీట్ వివాదస్పమైంది. పాతికేళ్ల తర్వాత అధికార మార్పు ముంగిట నిలిచిన త్రిపురలో అల్లర్లు చెలరేగి భాజపా, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారితీశాయి. మరోవైపు త్రిపుర గవర్నర్‌, డీజీపీలతో మాట్లాడిన కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.