యాప్నగరం

ఆధార్‌ అనుసంధానం గడువు పొడగింపు

బ్యాంకు సేవలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు డిసెంబరు 31ని తుది గడువుగా ఇంతకుముందు ప్రకటించిన నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

TNN 13 Dec 2017, 5:46 pm
బ్యాంకు సేవలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు డిసెంబరు 31ని తుది గడువుగా ఇంతకుముందు ప్రకటించిన నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం (డిసెంబర్ 13) ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అయితే, ఎప్పటి వరకు పొడిగించారో ఈ ప్రకటనలో తెలపలేదు. ప్రభుత్వం నిర్దేశించిన తేదీ వరకు ఆధార్, పాన్‌ను బ్యాంకుతో తప్పనిసరిగా అనుసంధానించాలని మాత్రం సూచించింది.
Samayam Telugu centre extends deadline for aadhaar bank account linkage
ఆధార్‌ అనుసంధానం గడువు పొడగింపు


బ్యాంక్ ఖాతాలు, మ్యూచవల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు తదితర వాటన్నింటితో ఆధార్‌‌ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్దేశించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేశారు.

సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై విచారణను గురువారం (డిసెంబర్ 14) చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకు సేవలకు ఆధార్‌ అనుసంధాన గడువును కేంద్రం ఎత్తివేసినట్లు తెలుస్తోంది. ఈ గడువును 2018 మార్చి 31 వరకు పొడిగించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ఆధార్‌ నంబర్‌ తీసుకోని వారికి ఇది వర్తిస్తుందని పేర్కొనడం గమనార్హం.

మరోవైపు మొబైల్‌ నంబర్‌కు ఆధార్‌ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6తో, వివిధ పథకాలు, ప్రభుత్వ సేవల కోసం తుది గడువు 2018 మార్చి 31తో ముగుస్తున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.