యాప్నగరం

రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పెట్టుబడుల పెంపు: కేంద్రమంత్రి నిర్మల

రక్షణరంగంలో ఎఫ్‌డీఐలను 49శాతం నుంచి 74శాతానికి పెంపొందిస్తున్నట్టు కేంద్రమంత్రి నిర్మల తెలిపారు. ఆయుధ దిగుమతులపై దశలవారీగా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు.

Samayam Telugu 16 May 2020, 6:13 pm
ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ లోని వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నాలుగు రోజుల నుంచి వరుసగా ప్రకటిస్తున్నారు. తాజాగా మరికొన్ని ప్రకటనలు చేసిన ఆమె... ఆయుధ దిగుమతులపై దశలవారీగా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. దేశీయంగానే ఆయుధ అనుబంధ ఉత్పత్తులు ఉంటాయన్నారు. స్థానికంగానే ఆయుధ ఉత్పత్తుల సేకరణకు ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్టు తెలిపారు. దీనివల్ల దిగుమతుల భారం తగ్గనున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ఆర్థికంగా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బలోపేతమే లక్ష్యమన్నారు.
Samayam Telugu కేంద్రమంత్రి నిర్మల


డిఫెన్స్‌ సెక్టార్‌లో మేకిన్‌ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. రక్షణరంగంలో స్వయం వృద్ధి సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆధునిక ఆయుధ సంపత్తిని అందిపుచ్చుకోవాలన్నారు. రక్షణరంగంలో ఎఫ్‌డీఐలను 49శాతం నుంచి 74శాతానికి పెంపొందిస్తున్నట్టు తెలిపారు. నిర్ణీత సమయంలోగా ఆయుధ సరఫరా జరిగేట్టు ఒప్పందాలు చేసుకుంటామని, ఆయుధ ఒప్పందాల పరిశీలనకు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ట్రయల్‌ అండ్‌ టెస్టింగ్ తర్వాత ఆయుధ ఒప్పందాలుంటాయన్నారు.

రవాణా, టూరిజం రంగాలను అభివృద్ధి చేసే దిశగా కేంద్ర అడుగులు వేస్తుందని కేంద్రమంత్రి నిర్మల తెలిపారు. పలు రంగాలు సరళీకరణ విధానాలు కోరుకుంటున్నాయని.. ఒకే దేశం ఒకే మార్కెట్ విధానాన్ని అమలు చేస్తామని ఆమె ప్రకటించారు. భవిష్యత్ లో పోటీని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బీఏఎఫ్ఆర్ అమలులో భారత్ ముందుందని నిర్మలా తెలిపారు. బొగ్గు, సహజ వనరులు, ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్పేస్‌ మేనేజ్‌మెంట్‌, డిఫెన్స్‌ ప్రొడక్షన్‌, స్పేస్‌, అణుశక్తి రంగాల్లో నూతన సంస్కరణలు తీసుకొని వస్తామని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.