యాప్నగరం

కరోనాపై కేంద్రం సర్వే.. ప్రజల ఫోన్లకు ఈ నంబర్ నుంచి కాల్స్...

కరోనాపై కేంద్రం టెలిఫోనిక్ సర్వే చేపట్టనుంది. 1921 నంబర్ నుంచి ప్రజల ఫోన్లకు కాల్స్ రానున్నాయి. ఈ కాల్ ద్వారా మీకున్న కరోనా లక్షణాల గురించి కేంద్రం ఆరా తీస్తుంది.

Samayam Telugu 21 Apr 2020, 10:07 pm
భారత ప్రభుత్వం కరోనా వైరస్ లక్షణాల విషయమై టెలిఫోనిక్ సర్వే చేపట్టనుంది. 1921 నంబర్ నుంచి దేశ ప్రజల ఫోన్ నంబర్లకు కాల్స్ రానున్నాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. కరోనా వ్యాప్తి, లక్షణాలు తదితర అంశాలపై ప్రజలకు ఫోన్ చేసి సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వే గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
Samayam Telugu phone call


ఇతర నంబర్ల నుంచి ఫోన్ చేసి ప్రజలను మోసే చేసే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. 1921 నంబర్ నుంచి మాత్రమే కాల్ చేసి సర్వే చేపడతామనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ప్రభుత్వం తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ.. కొందరు క్వారంటైన్‌కు భయపడి లక్షణాల విషయాన్ని బహిర్గతం చేయడం లేదు. ఇలాంటి వారి నుంచి సమాచారం సేకరించడానికి ఫోన్ సర్వే ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
ఫోన్ సర్వేలోనైనా లక్షణాల గురించి బహిర్గతం చేస్తేనే వారికి కరోనా పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా ప్రజల సహకారం మీదే ఈ టెలిఫోనిక్ సర్వే ఆధారపడి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.