యాప్నగరం

రైతు బిడ్డల పెళ్లికి మత సంస్థల నిధులు!

‘‘వైద్య, విద్యా సేవలు తరహాలోనే.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు బిడ్డలను ఆదుకోవడం కూడా సామాజిక బాధ్యత’’

Samayam Telugu 13 Apr 2018, 3:13 pm
ర్థిక ఇబ్బందులతో పాటు తమ ఆడ బిడ్దలకు పెళ్లిల్లు చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పేద రైతు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు మహారాష్ట్ర చారిటీ కమిషనర్ ఎస్.జి.డిగే కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ మతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల మిగులు నిధులను ఆడ పిల్లల పెళ్లిలకు వినియోగించాలని ఆదేశించారు.
Samayam Telugu 12mm


‘‘ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోడానికి చేస్తున్న తొలి ప్రయత్నం ఇది. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్ చట్టం ప్రకారం.. సామాజిక అవసరాల కోసం చారిటబుల్ ఇనిస్టిట్యూషన్ల నిధులను వినియోగించుకునే అధికారం మాకు ఉంది’’ అని డిగే తెలిపారు.

‘‘మహారాష్ట్రలోని విదర్బ, మరత్వాడాల్లో చాలామంది రైతులు ఆర్థిక ఇబ్బందులతోనే కాకుండా, తమ కుమార్తెలకు వివాహం చేయలేమనే మనోవేధనతో ఆత్మహత్యలు చేసుకున్నట్లు గుర్తించాం. ఈ నేపథ్యంలో ప్రముఖ మత స్వచ్ఛంద సంస్థల మిగులు నిధులు (సర్‌ప్లస్ ఫండ్స్).. రైతు బిడ్డల వివాహాలకు వినియోగించాలని నిర్ణయించాం’’ అని తెలిపారు.

‘‘పేద యువతులకు సామూహిక వివాహాలు చేయడం కూడా సామాజిక బాధ్యత అని మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్ చట్టం, 1950 నిబంధనల్లో ఉంది. మతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు ప్రస్తుతం ఆ నిధులను వైద్య సేవలు, విద్యా సంస్థల అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇకపై ఆ నిధులను రైతు బిడ్డల వివాహాలకూ ఉపయోగిస్తాం’’ అని తెలిపారు.
Read this article in English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.