యాప్నగరం

జయ మృతిపై సుప్రీంకోర్టు‌లో పిటిషన్

జయలలిత మృతి విషయంలో ఇప్పటికీ ఎందరో అభిమానులకి పలు అనుమానాలున్నాయి.

TNN 14 Dec 2016, 2:14 pm
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి విషయంలో ఇప్పటికీ ఎందరో అభిమానులకి పలు అనుమానాలున్నాయి. సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అమ్మ చేరినప్పటి నుంచి ఆమె ఆరోగ్య విషయాలూ రహస్యంగానే ఉంచుతూ వచ్చారు. అసలు ఆమెకి ఏమైందో కూడా తెలియని పరిస్థితి. కొన్ని రోజుల క్రితం ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని, పేపర్ చదువుతోందని, కావాల్సినవి అడిగి తీసుకుంటున్నారని కూడా అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆ సమయంలోనైనా ఆమె వీడియోనో, ఫోటోనో రాష్ట్ర ప్రజల కోసం షేర్ చేసి ఉంటే బాగుండేది.
Samayam Telugu chennai ngo files pil in supreme court demanding cbi probe on jayas death
జయ మృతిపై సుప్రీంకోర్టు‌లో పిటిషన్


హఠాత్తుగా కార్డియాక్ అరెస్టు కావడం, అమ్మ లోకాన్ని విడిచి వెళ్లడం జరిగిపోయాయి.దీంతో చాలా మందికి ఆమె మరణంపై అనేక అనుమానాలు కలిగాయి. ఓ స్వచ్ఛంద సంస్థకు అలాంటి అనుమానమే కలిగి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అమ్మ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని, వైద్య నివేదికలను స్వాధీనం చేసుకోవాలని ఆ పిటిషన్ లో కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.