యాప్నగరం

చెన్నైలో ప్రారంభమైన తొలి భూగర్భ మెట్రో రైలు మార్గం

తమిళనాడు రాజధాని చెన్నైలో కొత్తగా నిర్మించిన భూగర్భ మెట్రో రైలు మార్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సమక్షంలో...

Samayam Telugu 14 May 2017, 8:25 pm
తమిళనాడు రాజధాని చెన్నైలో కొత్తగా నిర్మించిన భూగర్భ మెట్రో రైలు మార్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సమక్షంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ ప్రారంభించారు. మొదటి దశలో భాగంగా భూగర్భ రైలు మార్గాన్ని తిరుమంగళం నుంచి నెహ్రూ పార్క్‌ వరకు నిర్మించారు. ఏడున్నర కిలోమీటర్లు వున్న ఈ రైలు మార్గంలో మొత్తం 8 స్టేషన్స్ వున్నాయి. చెన్నైలో నిర్మించిన తొలి భూగర్భ రైలు మార్గం ఇదే కావడం విశేషం.
Samayam Telugu chennai underground metro was inaugurated by venkaiah naidu and palaniswami
చెన్నైలో ప్రారంభమైన తొలి భూగర్భ మెట్రో రైలు మార్గం


ఈ రైలు మార్గం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టుకి దివంగత ముఖ్యమంత్రి జయలలిత శంఖస్థాపన చేశారని గుర్తుచేసుకున్నారు. 2018 సగానికల్లా మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేస్ 1 మొత్తం పూర్తవుతుందని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... చెన్నై మెట్రో రైలు ప్రాజెక్ట్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్వప్నం అని అన్నారు. ఈరోజు ఆమెని ఎంతో మిస్ అవుతున్నామని గుర్తు చేసుకున్నారు వెంకయ్య నాయుడు. చెన్నై మెట్రో ప్రాజెక్టు మొత్తం పూర్తయితే, 7.75 లక్షల మంది రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది. చెన్నై మెట్రో ప్రాజెక్టు విస్తరణకి కేంద్రం చేయదగిన సహాయం అంతా చేస్తుందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వారికి హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.