ఓ వెరైటీ ప్రేమ్ కహానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. చెల్లిని పెళ్లి చూపుల్లో చూసేందుకు వచ్చి.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన ఆమె అక్కతో జంపైపోవడం షాకింగ్గా మారింది. చెన్నైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా హాట్టాపిక్ అయ్యింది. నగరంలోని మైలాపూర్ ఏకాంబరం పిళ్లై వీధికి చెందిన వ్యక్తికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కుమార్తెకు పెళ్లై మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఇక రెండో అమ్మాయికి పెళ్లి చేయాలని భావించి.. సంబంధాలు వెతికాడు. ఐదు నెలల క్రితం అన్నాదురై అనే యువకుడితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు.
యువకుడు అమ్మాయిని చూడటానికి వచ్చి వెళ్లాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి కబురు రాలేదు. అయితే ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం.. పెద్ద కూతురు కనిపించకుండా పోయింది. ఆమె ఎటు వెళ్లిందా అని గాలించిన తండ్రి.. అనుమానంతో కూతురు గురించి ఆరా తీస్తేగాని తెలియలేదు.. ఆమె అన్నాదురైతో వెళ్లిపోయిందని. పెళ్లి చూపులకు వచ్చిన సమయంలో యువతి అక్కతో అతడికి పరిచయం ఏర్పడింది. ఐదు నెలలుగా ఇద్దరి మధ్య మాటలు కూడా నడుస్తుండగా.. ప్రేమలో కూడా పడ్డారట. ఈ స్టోరీ మొత్తం తెలుసుకున్న తండ్రి షాకయ్యాడట.
దీంతో ఆయన మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె పోతూ పోతూ ఇంట్లో ఉన్న ఐదు సవర్ల బంగారం, రూ.2లక్షల డబ్బుతో పాటూ మూడేళ్ల కొడుకుని కూడా తీసుకెళ్లిందని చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన జంట కోసం గాలిస్తున్నారు.
Read This Story In Tamil
యువకుడు అమ్మాయిని చూడటానికి వచ్చి వెళ్లాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి కబురు రాలేదు. అయితే ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం.. పెద్ద కూతురు కనిపించకుండా పోయింది. ఆమె ఎటు వెళ్లిందా అని గాలించిన తండ్రి.. అనుమానంతో కూతురు గురించి ఆరా తీస్తేగాని తెలియలేదు.. ఆమె అన్నాదురైతో వెళ్లిపోయిందని. పెళ్లి చూపులకు వచ్చిన సమయంలో యువతి అక్కతో అతడికి పరిచయం ఏర్పడింది. ఐదు నెలలుగా ఇద్దరి మధ్య మాటలు కూడా నడుస్తుండగా.. ప్రేమలో కూడా పడ్డారట. ఈ స్టోరీ మొత్తం తెలుసుకున్న తండ్రి షాకయ్యాడట.
దీంతో ఆయన మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె పోతూ పోతూ ఇంట్లో ఉన్న ఐదు సవర్ల బంగారం, రూ.2లక్షల డబ్బుతో పాటూ మూడేళ్ల కొడుకుని కూడా తీసుకెళ్లిందని చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన జంట కోసం గాలిస్తున్నారు.
Read This Story In Tamil