యాప్నగరం

199 ఏళ్ల గ్రంథాలయానికి ప్రాణం పోస్తున్నారు!

యువత తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. మరుగున పడిపోతున్న పురాతన గ్రంథాలయానికి తిరిగి ప్రాణం పోసేందుకు చైన్నె యువత ఏం చేస్తున్నారో చూడండి.

TNN 25 Nov 2017, 12:24 pm
చెన్నైలోని 199 ఏళ్ల పురాతనమైన మద్రాస్ లిటరరీ సొసైటీ లైబ్రరీ కాలగమనంలో కలిసిపోతోంది. ఈ విషయం తెలుసుకున్న చెన్నై విద్యార్థులు, యువ ప్రొఫెసర్లు ఒక బృందంగా ఏర్పడి పాడైపోయిన పుస్తకాలను పునరుద్ధరిస్తున్నారు. దేశంలోనే అతి పురాతన గ్రంథాలయాల్లో ఒకటైన ఈ లైబ్రరీలో దాదాపు 57,000 పుస్తకాలు ఉన్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని దశలవారీగా బాగుచేస్తున్నారు. వివిధ రసాయనాలతో చెదపట్టిన పుస్తకాలను శుభ్రం చేస్తున్నారు. గత రెండేళ్లలో రెండు వేలకు పైగా పుస్తకాలకు పూర్వ రూపం తెచ్చారు. ఈ చారిత్రక గ్రంథాలయాన్ని కాపాడేందుకు విద్యార్థులు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయమే కదూ!
Samayam Telugu chennai youths come together to restore 199 year old library
199 ఏళ్ల గ్రంథాలయానికి ప్రాణం పోస్తున్నారు!


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.