యాప్నగరం

మోడీ సమక్షంలోనే కన్నీళ్లు పెట్టుకున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్. థాకూర్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో కంటనీరు పెట్టుకున్నారు.

TNN 24 Apr 2016, 4:41 pm
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్. థాకూర్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో కంటనీరు పెట్టుకున్నారు. దేశంలో న్యాయవ్యవస్థ చాలా పని ఒత్తిడి ఎదుర్కోంటోంది.. ఫలితంగా ప్రజలకి న్యాయవ్యవస్థపై విశ్వాసం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తూ థాకూర్ కంటనీరు పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. పెరిగిపోతున్న కేసులు, పెండింగ్‌లో వున్న కేసుల్ని త్వరితగతిన విచారించేందుకు అవసరమైనంత మంది న్యాయమూర్తులు మన దేశంలో లేరని థాకూర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రస్తుతం వున్న 21,000 న్యాయమూర్తుల సంఖ్యని 40,000లకి పెంచితే కానీ కేసుల పరిష్కారంలో వేగం పుంజుకోదని ఆయన అభిప్రాయపడ్డారు. 1987లో అప్పటి లా కమిషన్ సిఫార్సులని ప్రస్తావిస్తూ... ప్రతీ 10 లక్షల మంది జనాభాకి 10 మంది న్యాయమూర్తులుగా వుండటాన్ని వ్యతిరేకిస్తూ.. ఆ సంఖ్యని ప్రతీ 10 లక్షల మంది జనాభాకి 50 మంది న్యాయమూర్తులకి పెంచమని లా కమిషన్ సూచించినప్పటికీ.. ఇప్పటివరకు ప్రభుత్వాలు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై థాకూర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం దేశంలో జడ్జీలు-జనాభా ప్రతీ 10 లక్షల మంది జనాభాకి 15 మంది న్యాయమూర్తులు మాత్రమే వున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, యుకేలతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువ అని థాకూర్ ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.
Samayam Telugu chief justice of india ts thakur breaks down in front of pm modi
మోడీ సమక్షంలోనే కన్నీళ్లు పెట్టుకున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి


1987లో అవసరమైన న్యాయమూర్తుల సంఖ్య 40,000గా వుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 25 కోట్ల మంది జనాభా పెరిగింది. విదేశీ పెట్టుబడులని ఆహ్వానిస్తున్నాం. ప్రపంచదేశాలతో పోటీపడి మన ఆర్థిక వ్యవస్థ కూడా అభివద్ధి చెందుతోంది అని చెబుతూ పరోక్షంగా న్యాయవ్యవస్థ మాత్రం అక్కడే వుండిపోయిందని థాకూర్ గుర్తుచేశారు. థాకూర్ ఆవేదనపై స్పందించిన ప్రధాని మోడీ.. తమ ప్రభుత్వం న్యాయవ్యవస్థతో కలిసి పనిచేస్తూ ఈ సమస్యకి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా దేశంలో ఎన్నో కాలం చెందిన చట్టాలున్నాయని... ప్రస్తుత కాలానికి వాటితో ప్రయోజనం లేనందున ఆయా చట్టాలని తొలగించాల్సిన అవసరం వుందని మోడీ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.