యాప్నగరం

లడఖ్: భారత సైనికుల చేతికి చిక్కిన చైనా జవాన్

Ladakh: నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా సైనికుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అతడికి వైద్య చికిత్స, ఆహారం, దుస్తులు అందించారు.

Samayam Telugu 19 Oct 2020, 9:26 pm
డఖ్ సరిహద్దులో చైనాకు చెందిన ఓ సైనికుడిని భారత భద్రతా దళాలు పట్టుకున్నాయి. అతడు అనుకోకుండా భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి చెందిన ఆ జవాన్.. లడఖ్‌లోని చుమర్-డెమ్‌చోక్ ప్రాంతంలో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలో ప్రవేశించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. పీఎల్‌ఏ సైనికుడిని కార్పోరల్ వాంగ్ యా లాంగ్‌గా గుర్తించినట్లు ఇండియన్ ఆర్మీ సోమవారం (అక్టోబర్ 19) తెలిపింది. ప్రస్తుతం అతడు తమ ఆధీనంలో ఉన్నట్లు వెల్లడించింది.
Samayam Telugu లడఖ్ సరిహద్దు
Chinese PLA soldier captured by Indian Army in Ladakh’s Chumar-Demchok area; to be handed back (Representational Image)


లడఖ్‌లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. ఎత్తైన ప్రదేశంలో కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి రక్షించడానికి చైనా జవాన్‌కు తగిన వైద్య సహాయం అందించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అతడికి ఆహారం, వెచ్చని దుస్తులు ఇచ్చినట్లు వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. తగిన విధానాన్ని అనుసరించి ఆ జవాన్‌ను చైనా సైన్యానికి తిరిగి అప్పగిస్తామని ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.

Don't Miss: త్వరలో సీఏఏ అమలు చేస్తాం: బీజేపీ అధ్యక్షుడు

తప్పిపోయిన సైనికుడు ఆచూకీ గురించి పీఎల్‌ఏ నుంచి కూడా అభ్యర్థన వచ్చిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత నిర్దిష్ట ప్రోటోకాల్స్ ప్రకారం అతడిని తిరిగి చైనాకు అప్పగిస్తామని వెల్లడించింది. తప్పిపోయిన పీఎల్‌ఏ జవాన్‌ను చుషుల్ - మోల్డో మీటింగ్ పాయింట్ వద్ద చైనా అధికారులకు తిరిగి అప్పగిస్తామని తెలిపింది.


సరిహద్దులో భారత్, చైనా సైనికుల మధ్య కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో ఘర్షణ అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. చైనా వైపు కూడా భారీగానే నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. గల్వాన్ ఘర్షణ అనంతరం చైనా జవాన్లు సరిహద్దులో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఘటన చర్చనీయాంశంగా మారింది.

Also Read: గుడ్ న్యూస్: దేశంలో డిసెంబర్ నాటికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

Must Read: భూగర్భంలో ఉగ్రవాదుల రహస్య స్థావరం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.