యాప్నగరం

​రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటర్ తెలుగువాడే!

ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నది మరెవరో కాదు

TNN 29 Jun 2017, 9:50 am
రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల అంకం ముగుస్తున్న నేపథ్యంలో, ఈ ఎన్నికకు సంబంధించిన ఓటర్ లిస్టును తయారు చేసింది ఎన్నికల కమిషన్. రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేలు ఓటర్లుగా సాగే ఈ ఎన్నికల్లో వారందరి వివరాలతో ఈసీ ఓటర్ల జాబితాను రూపొందించింది. మరి ఈ జాబితాలో ఒక తెలుగు ప్రజాప్రతినిధి తొలి స్థానంలో ఉండటం విశేషం. రాష్ట్రాల పేర్లను, ప్రజాప్రతినిధుల పేర్లను అక్షర క్రమం ప్రకారం తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నది మరెవరో కాదు ఎంపీ చిరంజీవి.
Samayam Telugu chiranjeevi is the first voter in presidential polls
​రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటర్ తెలుగువాడే!


ఈ సినీ హీరో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో మెగాస్టార్ తొలి ఓటర్ గా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కావడంతో చిరంజీవికి ఈ స్థానం దక్కింది. అలాగే ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి పేర్లను అక్షర క్రమంలో చూస్తే చిరంజీవికి తొలి స్థానం దక్కుతోంది. ఓటర్ల జాబితాలో రాజ్యసభ సభ్యులు తొలి స్థానాల్లో ఉండటంతో.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును కలిగిన వారందరిలోనూ చిరంజీవికే తొలి స్థానం లభించింది.

కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అయిన చిరంజీవి ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి మీరాకుమార్ కే ఓటేస్తారని అనుకోవాలి. ఆత్మప్రబోధం మేరకు ఓటును వేసే అవకాశం ఉంటుంది ఈ ఎన్నికల్లో. ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నారు యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాడి కృష్ణారావు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.