యాప్నగరం

చిన్నారులను కాపాడి.. ప్రాణాలు వదిలిన బస్సు డ్రైవర్

వరద నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను కాపాడే క్రమంలో ఓ బస్సు డ్రైవర్ బలయ్యాడు.

Samayam Telugu 26 Jun 2018, 3:52 pm
ఆపదలో ఉన్న సాటి మనిషిని కాపాడటం కోసం తన ప్రాణాలను త్యాగం చేసే వాళ్లను హీరో అంటారా.? ఇప్పుడు మీరు చదవబోయేది ఓ హీరో కథే. రుతుపవనాల ప్రభావంతో మహరాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ముంబైలో వరదలొస్తున్నాయనే వార్తలు వింటూనే ఉన్నాం. కొంకణ్ తీరంలో ఉండే పాల్ఘర్‌లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తుండగా.. బస్సు వరద నీటిలో ఆగిపోయింది. దీంతో బస్సు దిగిన ఇద్దరు స్కూలు పిల్లలు సరదాగా నీటిలో ఆడటం మొదలుపెట్టారు.
Samayam Telugu drowning


కానీ అనూహ్యంగా వారు ప్రవాహంలో కొట్టుకెళ్లడం గమనించిన బస్సు డ్రైవర్ ప్రకాష్ బాలు పాటిల్ వెంటనే స్పందించి వారిని కాపాడాడు. కానీ తనను తాను నియంత్రించుకోలేక వరద ఉద్ధృతి ధాటికి కొట్టుకుపోయాడు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది అతడి మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రకాష్ ఆకస్మిక మరణంతో అతడి తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.