యాప్నగరం

A Promised Land: బరాక్ ఒబామాపై ఉత్తర్ ప్రదేశ్‌లో కేసు నమోదు

Rahul Gandhi: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ఉత్తర్ ప్రదేశ్‌లోని లాల్‌గంజ్ సివిల్ కోర్టులో కేసు నమోదైంది. ఒబామా రాసిన పుస్తకం ‘ఏ ప్రామిస్ట్ ల్యాండ్’లో రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌ను అవమానించారని పిటిషనర్ ఆరోపించారు.

Samayam Telugu 19 Nov 2020, 4:53 pm
మెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై భారత్‌లో సివిల్ కేసు నమోదైంది. ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పేరుతో ఒబామా రాసిన పుస్తకంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌ను అవమానించారంటూ యూపీకి చెందిన ఓ లాయర్ గురువారం (నవంబర్ 19) ఈ కేసు వేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసు నమోదు చేయకపోతే యూఎస్ ఎంబసీ ముందు నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.
Samayam Telugu బరాక్ ఒబామా
Civil suit filed in UP against Barack Obama book A Promised Land for insulting Rahul Gandhi


ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన జ్ఞాన్‌ ప్రకాశ్‌ శుక్లా ఈ కేసు వేశారు. ఆయన ఆల్‌ ఇండియా రూరల్ బార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పుస్తకంలో ఒబామా చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని జ్ఞాన్‌ ప్రకాశ్‌ శుక్లా ఆరోపించారు. ఆ పుస్తకానికి వ్యతిరేకంగా అభిమానులు వీధుల్లోకి వస్తే ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు లాల్‌గంజ్‌ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును డిసెంబర్ 1న విచారణకు తీసుకునే అవకాశం ఉంది.

తన జీవిత సంఘటనలను, అమెరికా అధ్యక్షుడిగా తన అనుభవాలను వివరిస్తూ బరాక్ ఒబామా ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పేరుతో పుస్తకం రాశారు. నవంబర్ 17న మార్కెట్లోకి విడుదలైన ఈ బుక్ హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. విడుదలైన 24 గంటల్లోనే 890,000 కాపీలు అమ్ముడయ్యాయి. అమెరికా, కెనాడాలో రికార్డు స్థాయిలో అమ్మకాలు ఉన్నాయి. అమెరికాలో ఇప్పటివరకు ఏ మాజీ అధ్యక్షుడు రాసిన పుస్తకానికి కూడా ఈ స్థాయిలో అమ్మకాలు లేవు. అంతేకాదు, ఆధునిక చరిత్రలో ఏ దేశాధినేత రాసిన పుస్తకం కూడా ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడైన దాఖలాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏమిటీ వివాదం..?
A Promised Land పుస్తకంలో బరాక్ ఒబామా.. రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గురించి ప్రస్తావించారు. తన కుమారుడు రాహుల్ గాంధీకి ఎలాంటి అడ్డంకి కలిగించరనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. మన్మోహన్‌‌ను ప్రధానిగా చేశారని ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. అంతేకాకుండా ప్రధాని పదవిని కట్టబెట్టినందుకు మన్మోహన్ సింగ్ ఆమెకు రుణపడి ఉన్నారని పేర్కొన్నారు. రాహుల్‌ గాందీ గురించి ప్రస్తావిస్తూ.. ‘పని పూర్తి చేసి టీచర్ మెప్పును పొందాలని ఆరాటపడే విద్యార్థిలా ఉంటారే తప్ప, ప్రావీణ్యం సంపాదించాలనే తపన ఆయనలో కనిపించదు’ అని విమర్శనాత్మకంగా రాశారు. ఇది రాహుల్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

Also Read: ముంబై దాడుల సూత్రధారికి శిక్ష విధించిన పాక్ కోర్టు

Must Read: ఫైజర్ గుడ్ న్యూస్.. వ్యాక్సిన్ 95% సక్సెస్, క్రిస్మస్ లోగా పంపిణీ
Don't Miss: ఏడేళ్ల బాలికను చంపి గుండెను తిన్నారు.. సంతానం కోసమట, ఎంత ఘోరం?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.