యాప్నగరం

తరగతులకు డుమ్మా.. ప్రశ్నించిన హెచ్‌ఎం తలపై దాడి!

తరగతులకు డుమ్మా కొడుతున్న అంశంపై ప్రశ్నించినందుకు ఓ విద్యార్థి తన స్కూల్ హెడ్‌మాస్టర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తమిళనాడులోని తిరుపత్తూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

TNN 6 Feb 2018, 12:15 am
తరగతులకు డుమ్మా కొడుతున్న అంశంపై ప్రశ్నించినందుకు ఓ విద్యార్థి తన స్కూల్ హెడ్‌మాస్టర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తమిళనాడులోని తిరుపత్తూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక గవర్నమెంట్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న ఓ బాలుడు మరో నలుగురు స్నేహితులతో కలిసి గత కొన్ని రోజులుగా తరచూ తరగతులకు గైర్హాజరవుతున్నారు. క్లాసులు మానేసి పాఠశాల పరిసరాల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు.
Samayam Telugu class 11 student stabs school headmaster questioning over bunking classes
తరగతులకు డుమ్మా.. ప్రశ్నించిన హెచ్‌ఎం తలపై దాడి!


సోమవారం (ఫిబ్రవరి 5) ఆ అయిదుగురు విద్యార్థులు మరోసారి తరగతులకు డుమ్మా కొట్టి బయట తిరుగుతూ హెడ్‌మాస్టర్ ఆర్. బాబు దృష్టిలో పడ్డారు. ఆయణ్ని చూడటంతోనే నలుగురు విద్యార్థులు అక్కడ నుంచి పారిపోగా.. ఐదో విద్యార్థి ఖాళీగా ఉన్న ఓ తరగతి గదిలో దాక్కున్నాడు.

ఆ విద్యార్థిని దొరకబుచ్చుకున్న హెడ్‌మాస్టర్.. తరగతులకు ఎందుకు డుమ్మా కొడుతున్నావంటూ రెండు దెబ్బలు తగిలించాడు. దీంతో ఆ అల్లరిపిడుగు అక్కడే ఉన్న ఓ పదునైన వస్తువుతో ఆయణపై దాడి చేశాడు. కడుపులో, తల భాగంలో తీవ్రమైన గాయాలవడంతో హెడ్‌మాస్టర్‌‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.