యాప్నగరం

కుల్‌భూషణ్ చెప్పులతో దండకూర్చి షరీఫ్ మెడలో వేసి...

గూఢచర్యం ఆరోప‌ణ‌ల‌పై భార‌త నౌకాద‌ళ మాజీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు పాకిస్థాన్ ఆర్మీకోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

TNN 22 May 2017, 10:27 am
కుల్‌భూషణ్‌ జాదవ్‌ చెప్పులతో దండ తయారుచేసి పాక్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మెడలో వేసిన వారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తానని కోల్‌కతాకు చెందిన ముస్లిం మత పెద్ద సయ్యద్ షా అతీఫ్ అలీ ఖ్వాదేరి ప్రకటించారు. అంతే కాదు దండ వేసిన వ్యక్తి షరీఫ్‌ను భారత్ సరిహద్దు చుట్టూ పరిగెత్తించాలని సూచించారు. ఈ ప్రకటన చేసిన మతపెద్ద మరేవరో కాదు ఇటీవల బాలీవుడ్‌ సింగర్‌ సోనూ నిగమ్‌‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన ఆయనే. షా అతీఫ్ అలీ తాజాగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu cleric offers rs20 lakh reward for garlanding pakistan pm with jadhavs shoes
కుల్‌భూషణ్ చెప్పులతో దండకూర్చి షరీఫ్ మెడలో వేసి...


కుల్‌భూషణ్‌ జాదవ్‌ ఉపయోగించిన చెప్పులను, షూలను దండగా తయారుచేసి తీసుకెళ్లి పాకిస్థాన్‌ ప్రధానీ నవాజ్‌ షరీఫ్‌ మెడలో వేసి, అతడిని భారత సరిహద్దు చుట్టూ ఎవరు పరుగెత్తిస్తారో వారికి రూ.20లక్షలు బహుమతిగా ఇస్తానని అన్నారు. పాకిస్థాన్‌ తాను ముస్లిం దేశం అని చెప్పుకుంటోంది. కానీ, ఉగ్రవాదానికి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. ప్రధాని తప్పనిసరిగా ఉగ్రవాదపై చర్యలు తీసుకోవాలి. కానీ ఆ విషయంలో షరీఫ్ విఫలమయ్యాడని దుయ్యబట్టారు. ప్రపంచంలోని అనేక ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గూఢచర్యం ఆరోప‌ణ‌ల‌పై భార‌త నౌకాద‌ళ మాజీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు పాకిస్థాన్ ఆర్మీకోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించిన విష‌యంపై అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం మే 18 న మధ్యంతర తీర్పు వెలువ‌రించిన విషయం తెలిసిందే. కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసు అంశంపై పాకిస్థాన్ చేస్తోన్న వాదనలు సరికావని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు రోన్నే అన్నారు. పాక్ ఆర్మీ విధించిన ఈ మరణ శిక్ష తీర్పుపై స్టే విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.