యాప్నగరం

Arvind Kejriwal: సీబీఐ విచారణకు కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎంకి సంధించే ప్రశ్నలు ఇవేనా?

Arvind Kejriwal లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ శుక్రవారం సాయంత్రం నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 16న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. నోటీసులకు స్పందించిన కేజ్రీవాల్.. సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. దీంతో సీబీఐ విచారణకు హాజరవుతోన్న తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలవనున్నారు. ఇప్పటివరకు ఏ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు సీబీఐ విచారణకు హాజరుకాలేదు. దీంతో సీబీఐ కార్యాయాన్ని బారికేడ్లతో దిగ్బంధనం చేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 16 Apr 2023, 10:35 am

ప్రధానాంశాలు:

  • ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణ
  • ఇప్పటికే ముగ్గురు ఆప్ మంత్రులు అరెస్ట్
  • సీబీఐ విచారణకు హాజరవుతోన్న కేజ్రీవాల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Arvind Kejriwal
మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ విచారణకు హాజరుకావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మంత్రులు సహా ఆప్ నేతలు, కార్యకర్తలు భారీగా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ కార్యాలయంవద్ద దాదాపు 1000 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరిస్తుంచారు. ఆ ప్రాంతాన్ని బారికేడ్లతో దిగ్బంధనం చేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇక, సీబీఐ విచారణకు హాజరుకాబోతున్న కేజ్రీవాల్‌... తాను అవినీతిపరుడినైతే ప్రపంచంలోనే నిజాయతీ గల వ్యక్తులెవరూ ఉండబోరని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు డిమాండు చేస్తున్నారని, పార్టీ అలా ఆదేశిస్తే సీబీఐ ఎందుకు అరెస్టు చేయకుండా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. నిండా అవినీతిలో నిండా మునిగిపోయిన వ్యక్తి (మోదీని ఉద్దేశించి) అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ పార్టీనీ ఇంతలా వేధించలేదు.. ఆప్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని దుయ్యబట్టారు.

కోర్టులో తప్పుడు సాక్ష్యాలను చూపించడం, దర్యాప్తు పేరిట వేధింపులకు గురిచేసినందుకు సీబీఐ, ఈడీలపై కేసులు పెడతామని కేజ్రీవాల్‌ తెలిపారు. మరోవైపు, కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్ల నేపథ్యంలో సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని ఆప్ సర్కారునిర్ణయించింది. విద్యుత్తు సబ్సిడీపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది.

కాగా, విచారణకు హాజరవుతోన్న కేజ్రీవాల్‌ను మద్యం పాలసీ రూపకల్పనలో అనుసరించిన ప్రక్రియ గురించి సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది. మద్యం విధానాన్ని రూపొందించడానికి అనుసరించిన ప్రక్రియ.. క్యాబినెట్ ముందుంచిన ఫైలు ఎందుకు అదృశ్యమైంది?. అందులోనే నిపుణులు, ప్రజలు, న్యాయ నిపుణుల అభిప్రాయాలున్నాయి కదా? లిక్కర్‌ వ్యాపారులకు, దక్షిణాది లిక్కర్‌ లాబీకి అనుకూలంగా మద్యం విధానానికి రూపకల్పన చేశారనే ఆరోపణలపై మీ సమాధానమేంటి? కొత్త ఎక్సైజ్‌ పాలసీని రూపొందించడంలో మీ పాత్ర ఏంటి? లిక్కర్‌ లాబీలు ప్రభావితం చేయడం గురించి మీకేం తెలుసు? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని సీబీఐ భావిస్తోంది.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.