యాప్నగరం

Jharkhand: ఢిల్లీ విజిట్‌పై సీఎం సోదరుడి రియాక్షన్ ఇది.. విచిత్రమైన కారణం చెప్పి హాట్‌ టాపికైన ఎమ్మెల్యే

రాజకీయ సంక్షోభం, బాలికల హత్యలతో జార్ఖండ్‌ (Jharkhand) రాష్ట్రం వార్తల్లో నిలుస్తుంది. వాటిపై రాజకీయ నాయకుల స్పందన మరింత చర్చనీయాంశంగా మారుతుంది. బాలికల హత్య గురించి.. రాజకీయ సంక్షోభం గురించి ప్రశ్నిస్తుంటే అక్కడి నాయకులు వింతైన సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా సీఎం సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఢిల్లీ పర్యటన గురించి అడిగితే.. లో దుస్తులు కొనడానికి వెళ్లానని చెప్పారు. దాంతో ఆయనపై బీజేపీ నాయకుడు విమర్శలు గుప్పిస్తున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 8 Sep 2022, 12:56 pm

ప్రధానాంశాలు:

  • జార్ఖండ్‌లో వరస బాలిక హత్యలు
  • డుమ్కాలో హత్యకు గురైన ఇద్దరు అమ్మాయిలు
  • అధికార నేతలపై మండిపడుతున్న బీజేపీ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu CM Hemant Soren brother
Jharkhand: రాజకీయ సంక్షోభంతోనే కాకుండా అనేక దారుణమైన సంఘటనలతోనూ జార్ఖండ్ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలె జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) విశ్వాస పరీక్షలో గట్టెక్కారు. ఈ క్రమంలో ఆయన బీజేపీని తప్పుబట్టారు. ఆ పార్టీపై తీవ్రమైన విమరన్శలు చేశారు. మరోవైపు రాష్ట్రంలో బాలికలపై వరస హత్యలకు గురవుతున్నారు. వీటిపై ముఖ్యమంత్రి, ఆయన సోదరుడు స్పందించిన తీరు ఇప్పుడు.. చర్చానీయాంశంగా మారింది.
ఇటీవల డుమ్కా (Dumka) జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు అతి దారుణంగా హత్యకు గురయ్యారు. ప్రేమించలేదని ఓ అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెడితే.. మరో బాలిక లైంగిక వేధింపులతో, అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై సీఎం హేమంత్ సోరెన్ సోదరుడైన, ఎమ్మెల్యే బసంత్ సోరెన్‌ను (Basant Soren) ప్రశ్నించగా.. అనూహ్యమైన సమాధానం చెప్పారు. హత్యలు జరిగినప్పుడు రాష్ట్రంలో ఆయన లేకపోవడంపై అతనిని ప్రశ్నించగా.. లో దుస్తులు కొనుక్కోవడానికి ఢిల్లీకి వెళ్లానని బసంత్ సోరెన్ సమాధానం ఇచ్చారు.

"నాకు లోదుస్తులు అయిపోయాయి. కాబట్టి నేను వాటిని కొనడానికి ఢిల్లీకి వెళ్లాను. నేను వాటిని అక్కడ నుంచి తెచ్చుకున్నాను". అని బసంత్ సోరెన్ చెప్పారు. 15 రోజుల్లో డుమ్కాలో ఇద్దరు బాలికలు చనిపోయారు. వారి కుటుంబ సభ్యులను బుధవారం బసంత్ సోరెన్ పరామర్శించారు. కానీ ఆయన చెప్పిన సమాధానంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే.. ఆయన స్టేట్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. "పేద, గిరిజన ప్రజల నాయకుడు శిబు సోరెన్ కుమారుడు ఇప్పుడు లోదుస్తులు కొనడానికి డుమ్కా నుంచి ఢిల్లీకి వచ్చారా..?" అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. బాధితుల పట్ల ప్రవర్తించే తీరు ఇది కాదని ఆయన అన్నారు.


కాగా డుమ్కా‌లో జరిగిన దారుణ ఘటనల పట్ల సీఎం హేమంత్ సోరెన్ కూడా కొని రోజుల క్రితం ఈ విధంగానే స్పందించారు. జిల్లాలో జరుగుతున్న బాలికల హత్యలపై ప్రశ్నించగా.. "జరిగితే.. జరుగుతాయి.. ఎక్కడ జరగడం లేదు.." అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ మేరకు హేమంత్ సోరెన్‌ స్పందనపై బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ఇలానే స్పందించేందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలను, అత్యాచారాలను అరికట్టాల్సిన ముఖ్యమంత్రి ఇలా అనడమేంటని నిలదీశారు. కాగా ఈ హత్యా ఘటనలు స్థానికంగా సంచలనం రేపాయి. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా పట్టుబట్టారు. నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.