తీస్తా సెతల్వాద్, జుబేర్ అరెస్ట్లపై మమతా బెనర్జీ ఫైర్
సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్, జర్నలిస్ట్ జుబేర్ల అరెస్ట్లపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. నిజాలు మాట్లాడేవారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు అబద్ధపు ప్రచారం చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. కాగా నాలుగేళ్ల క్రితం చేసిన ట్వీట్కు సంబంధించిన ఆరోపణలపై జుబెయిర్ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వారికి మద్దతుగా ట్వీట్లు పెడుతున్నారు.
ప్రధానాంశాలు:
- కేంద్రం చర్యలను విమర్శించిన మమతా బెనర్జీ
- నిజం మాట్లాడే వారిని వేధిస్తున్నారని ఆరోపణలు
- జుబేర్ను రిమాండ్కు తరలించిన పోలీసులు
సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్, జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్లపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్రం చర్యలను దుయ్యబట్టారు. బీజేపీ సోషల్ మీడియా మొత్తం తప్పుడు సమాచారంతో నిండి ఉంటుందని, ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు. బూటకపు వీడియోలతో అబద్ధాలను ప్రచారం చేస్తారని విమర్శించారు. బీజేపీ నేతలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినప్పుడు, ఇతరులను అవమానించినప్పుడు మౌనంగా ఉంటారని, కానీ నిజం మాట్లాడే వారిని అరెస్ట్లు చేస్తారని విమర్శించారు. జర్నలిస్ట్ జుబేర్ను, తీస్తా సెతల్వాద్ను ఎందుకు అరెస్ట్ చేశారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. వారి అరెస్ట్లను యావత్ దేశం ఖండిస్తుందని మమతా బెనర్జీ అన్నారు. కాగా నాలుగేళ్ల క్రితం చేసిన ట్వీట్ మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా ఉందనే ఆరోపణతో జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ను ఢిల్లీ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే జుబేర్ అరెస్ట్పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అతని అరెస్ట్ను ఖండిస్తూ ట్వీట్ చేశారు.
ఇక గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టించాలరని ఆరోపణలతో సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ను, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్బీ శ్రీ కుమార్లున పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ సీఎం, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సుప్రీంకోర్టు ఇటీవల క్లీన్చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి.
ఇక గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టించాలరని ఆరోపణలతో సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ను, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్బీ శ్రీ కుమార్లున పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ సీఎం, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సుప్రీంకోర్టు ఇటీవల క్లీన్చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి.