కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో ‘ధార్మిక’ వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే కాకి వాలిందని తన కాన్వాయ్ని మార్పించాడు.. అనే వివాదాన్ని ఎదుర్కొంటున్న ఆయన ఇప్పుడు చేపల కూర తిని ప్రఖ్యాత ధర్మస్థలం ఆలయాన్ని సందర్శించడం వివాదంగా మారుతోంది. అటు విపక్షాలు ఈ విషయంలో సీఎంను విమర్శిస్తుండగా, మరోవైపు భక్తగణంలో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే సిద్ధరామయ్య మాత్రం ఈ విషయంలో తనను తాను సమర్థించుకుంటున్నారు.
గత ఆదివారం దక్షిన కర్ణాటక జిల్లాల పర్యటనకు వెళ్లారు సిద్ధరామయ్య. ఆ సందర్భంగా బంట్వాళ పట్టణంలో ప్రభుత్వ అతిథి గఈహంలో బసచేశారు. ఆ ప్రాంతంలో చేపల కూర బాగా ఫేమస్. ఉదయం పూట సీఎంకు కూడా ఆ ఆహారాన్ని తెప్పించారు. దాన్ని భుజించిన అనంతరం సీఎం ధర్మస్థలం వెళ్లారు. అక్కడ మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఈ విధంగా మాంసాహారం తిని దైవదర్శనానికి వెళ్లడం పట్ల విమర్శలు వస్తున్నాయి. సీఎం తీరు సబబు కాదని కొంతమంది విమర్శిస్తున్నారు. అయితే దేవుడు ఫలానా ఆహారాన్నే తిని దర్శనానికి రావాలని నియమం ఏదీ పెట్టలేదు.. అని ఎదురుదాడి చేస్తున్నారు సిద్ధరామయ్య. మహాభక్తుడు కన్నప్ప శివుడికి మాంసాన్నే నైవేధ్యంగా సమర్పించాడని, తను మాంసం తిని ఆలయాన్ని దర్శించుకోవడంలో తప్పేమీ లేదని ఆయన వాదిస్తున్నారు.
గత ఆదివారం దక్షిన కర్ణాటక జిల్లాల పర్యటనకు వెళ్లారు సిద్ధరామయ్య. ఆ సందర్భంగా బంట్వాళ పట్టణంలో ప్రభుత్వ అతిథి గఈహంలో బసచేశారు. ఆ ప్రాంతంలో చేపల కూర బాగా ఫేమస్. ఉదయం పూట సీఎంకు కూడా ఆ ఆహారాన్ని తెప్పించారు. దాన్ని భుజించిన అనంతరం సీఎం ధర్మస్థలం వెళ్లారు. అక్కడ మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఈ విధంగా మాంసాహారం తిని దైవదర్శనానికి వెళ్లడం పట్ల విమర్శలు వస్తున్నాయి. సీఎం తీరు సబబు కాదని కొంతమంది విమర్శిస్తున్నారు. అయితే దేవుడు ఫలానా ఆహారాన్నే తిని దర్శనానికి రావాలని నియమం ఏదీ పెట్టలేదు.. అని ఎదురుదాడి చేస్తున్నారు సిద్ధరామయ్య. మహాభక్తుడు కన్నప్ప శివుడికి మాంసాన్నే నైవేధ్యంగా సమర్పించాడని, తను మాంసం తిని ఆలయాన్ని దర్శించుకోవడంలో తప్పేమీ లేదని ఆయన వాదిస్తున్నారు.