యాప్నగరం

ముఖ్యమంత్రి ఫామ్‌హౌజ్‌ను జఫ్తు చేసిన ఈడీ

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కు చెందిన ఢిల్లీలోని ఫామ్ హౌజ్ ను ఎన్‌ఫోర్స్

TNN 3 Apr 2017, 3:43 pm
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కు చెందిన ఢిల్లీలోని ఫామ్ హౌజ్ ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం జప్తు చేశారు. అక్రమాస్తుల కేసులో వీరభద్రపై ఇటీవలే సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. తాజాగా మనీలాండరింగ్ కేసులో వీరభద్రకు చెందిన ఫామ్ హౌజ్ ను జప్తు చేశారు. ఢిల్లీలోని మొహ్రాలీ ప్రాంతంలో ‘మ్యాపిల్ డెస్టినేషన్స్ అండ్ డ్రీమ్ బిల్డ్’ ఫామ్ హౌజ్ ను సీఎం బినామీ పేరుతో నడిపిస్తున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.27కోట్లు.
Samayam Telugu cm virbhadra singh farm house in delhi attached
ముఖ్యమంత్రి ఫామ్‌హౌజ్‌ను జఫ్తు చేసిన ఈడీ


ఇప్పటికే ఐటీ, ఈడీ అధికారులు వీరభద్ర సహా ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై పలుమార్లు దాడులు చేశారు. సీబీఐ ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ పేరు కూడా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.