బొగ్గు కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడాకు జైలు శిక్ష పడింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా విధిస్తూ శనివారం (డిసెంబర్ 16) తీర్పు వెలువరించింది. కోల్కతాకు చెందిన విని ఐరన్, స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కంపెనీకి జార్ఖండ్లోని రాజారా నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో మధు కోడా, గుప్తాతో పాటు జార్ఖండ్ మాజీ సీఎస్ ఏకే బసు, విసును సీబీఐ కోర్టు ఇప్పటికే దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే.
ఈ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పైనా విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. అయితే.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గుప్తా ఈ కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను మన్మోహన్ వద్ద దాచిపెట్టినట్లు వార్తలు వచ్చాయి.
ఈ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పైనా విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. అయితే.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గుప్తా ఈ కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను మన్మోహన్ వద్ద దాచిపెట్టినట్లు వార్తలు వచ్చాయి.