యాప్నగరం

కొచిన్ షిప్ యార్డ్‌లో పేలుడు.. ఐదుగురి దుర్మరణం

కొచిన్ షిప్ యార్డ్‌లో మంగళవారం పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, 11 మంది గాయపడ్డారు.

TNN 13 Feb 2018, 12:29 pm
కొచిన్ షిప్ యార్డ్‌లో మంగళవారం పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, 11 మంది గాయపడ్డారు. ఓఎన్‌జీసీకి చెందిన భుషణ్ షిప్‌లోని వాటర్ ట్యాంక్‌ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కార్గో షిప్‌లోని నీటి ట్యాంకుల లోపలి వాతావరణం మంటలు వ్యాపించడానికి అనుకూలంగా ఉంటుంది. దీంతో వెంటనే వ్యాపించడంతో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దర్ని గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu cochin shipyard blast kills 5 injures 11 explosion reported on ship under repair
కొచిన్ షిప్ యార్డ్‌లో పేలుడు.. ఐదుగురి దుర్మరణం


మరమ్మతులు జరుగుతోన్న నౌకలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టామని, పరిస్థితి అదుపులో ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.