యాప్నగరం

మా ఆవిడ ఊరెళ్లింది, ఇంటికి రా.. అర్ధరాత్రి విద్యార్థినికి ప్రొఫెసర్ ఫోన్ కాల్

అర్ధరాత్రి పూట విద్యార్థినికి కాల్ చేసిన ప్రొఫెసర్ మా ఆవిడ ఊరెళ్లింది.. వంట చేయాలి.. ఇంటికి రా.. అంటూ అసభ్యంగా మాట్లాడారు. దీంతో సదరు విద్యార్థిని వీసీకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం గవర్నర్ వద్దకు చేరింది.

Samayam Telugu 15 Nov 2019, 3:52 pm
బాధ్యతాయుతమైన అధ్యాపక వృత్తిలో ఉన్న ఓ ప్రబుద్ధుడు అర్ధరాత్రి పూట విద్యార్థినికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. మా ఆవిడ ఇంట్లో లేదు.. వచ్చి వంట చేసి పెట్టు అని ఆర్డర్ వేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌‌లోని జీబీ పంత్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ప్రొఫెసర్ మాటలకు నిర్ఘాంతపోయిన సదరు విద్యార్థిని వైస్ ఛాన్స‌లర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు అధ్యాపకుడి బాగోతం బయటకు వచ్చింది.
Samayam Telugu phone call


సదరు ప్రొఫెసర్ రాత్రి పూట పదే పదే ఫోన్ చేసి తనను వేధించారని విద్యార్థిని వీసీకి ఫిర్యాదు చేసింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ రాత్రి పూట మెసేజీ పెట్టిన ప్రొఫెసర్.. తర్వాత కాల్ చేసి మా ఆవిడ ఇంట్లో లేదు.. వంట చేసేది ఎవరు? నువ్వు వచ్చేయ్ అన్నాడంటూ బాధిత విద్యార్థిని బోరుమంది.

ఫోన్లో మాట్లాడటమే కాదు.. ‘వంట చేయడం’ కోసం తన ఇంటికి రమ్మని సదరు ప్రొఫెసర్ ఆమెకు మెసేజీ కూడా పెట్టాడట. అదే సందేశాన్ని ఆమె వీసీకి చూపించింది. కానీ యూనివర్సిటీ కమిటీ మాత్రం ఇప్పటి వరకూ ఆ ప్రొఫెసర్‌‌కు ‘వంట చేసిపెట్టే మార్గం’ కనిపెట్టలేదు.

బాధిత విద్యార్థిని ఆందోళన చేపట్టడంతో.. వ్యవహారం గవర్నర్ దృష్టికి వెళ్లింది. ఈ వ్యవహారంపై ఆమె సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యుడైన ప్రొఫెసరుపై కఠిన చర్యలు తీసుకోవాలని వీసీని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.