సామాజిక మాధ్యమాలు, వెబ్ పోర్టల్స్పై సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతి విషయాన్ని మతకోణంలో చూస్తున్నాయని, ఇది దేశంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలో చూడటంతో దేశానికి చెడ్డ పేరు వస్తోందని వ్యాఖ్యానించింది. అంతేకాదు, సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. గతేడాది దేశంలో కోవిడ్-19 మొదటి దశ వ్యాప్తికి ఢిల్లీలో నిర్వహించిన తబ్లీగి జమాత్ మత ప్రార్ధనలే కారణమని ప్రచురించిన కథనాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ వర్గం మీడియా మతకోణంలో చేస్తున్న ప్రచారం వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని అభిప్రాయపడింది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సంస్థల పేర్లను నేరుగా ప్రస్తావించిన ధర్మాసనం.. వెబ్ పోర్టల్స్ జవాబుదారీతనంగా ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘దేశంలో ప్రతి విషయాన్ని మత కోణంలో చూపుతున్నారు. ఇది దేశంపై దుష్ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్లలో కంటెంట్ విషయంలో జవాబుదారీతనం కన్పించడం లేదు. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. సామాజిక మాధ్యమాలు దేన్నయినా ప్రచురించగలుగుతున్నాయి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే అవకాశం ఉంది. నియంత్రణ వ్యవస్థ లేక వ్యక్తుల పరువుకు నష్టం జరుగుతోంది. వ్యవస్థలు, న్యాయమూర్తులను కూడా చెడుగా చూపిస్తున్నారు’’ అని జస్టిస్ ఎన్.వి. రమణ అసహనం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ‘కేవలం మతపరమైన అంశాలనే కాకుండా కట్టుకథలను కూడా ప్రచారం చేసి.. నకిలీ వార్తలను ఉంచగలవు’ అన్నారు.
‘సోషల్ మీడియా సంస్థలు కేవలం బలవంతుల మాటలనే వింటున్నాయి.. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా వ్యవస్థలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తున్నాయి.. సామాజిక మాధ్యమ వేదికలు సామాన్యులకే కాదు.. న్యాయమూర్తులకు కూడా స్పందించట్లేదు.. ఈ పరిణామాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని’ అని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.
‘నకిలీ వార్తలపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ యూట్యూబ్లోకి వెళితే నకిలీ వార్తలు ఎంత స్వేచ్ఛగా ప్రచారం అవుతున్నాయో తెలుసుకోవచ్చు.. ఎవరైనా యూట్యూబ్లో ఛానెల్ని ప్రారంభించవచ్చు.. వెబ్ పోర్టళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేం ’ అని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలపై అన్ని హైకోర్టుల్లో దాఖలపై పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. వీటిపై ఆరు వారాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది.
‘దేశంలో ప్రతి విషయాన్ని మత కోణంలో చూపుతున్నారు. ఇది దేశంపై దుష్ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్లలో కంటెంట్ విషయంలో జవాబుదారీతనం కన్పించడం లేదు. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. సామాజిక మాధ్యమాలు దేన్నయినా ప్రచురించగలుగుతున్నాయి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే అవకాశం ఉంది. నియంత్రణ వ్యవస్థ లేక వ్యక్తుల పరువుకు నష్టం జరుగుతోంది. వ్యవస్థలు, న్యాయమూర్తులను కూడా చెడుగా చూపిస్తున్నారు’’ అని జస్టిస్ ఎన్.వి. రమణ అసహనం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ‘కేవలం మతపరమైన అంశాలనే కాకుండా కట్టుకథలను కూడా ప్రచారం చేసి.. నకిలీ వార్తలను ఉంచగలవు’ అన్నారు.
‘సోషల్ మీడియా సంస్థలు కేవలం బలవంతుల మాటలనే వింటున్నాయి.. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా వ్యవస్థలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తున్నాయి.. సామాజిక మాధ్యమ వేదికలు సామాన్యులకే కాదు.. న్యాయమూర్తులకు కూడా స్పందించట్లేదు.. ఈ పరిణామాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని’ అని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.
‘నకిలీ వార్తలపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ యూట్యూబ్లోకి వెళితే నకిలీ వార్తలు ఎంత స్వేచ్ఛగా ప్రచారం అవుతున్నాయో తెలుసుకోవచ్చు.. ఎవరైనా యూట్యూబ్లో ఛానెల్ని ప్రారంభించవచ్చు.. వెబ్ పోర్టళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేం ’ అని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలపై అన్ని హైకోర్టుల్లో దాఖలపై పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. వీటిపై ఆరు వారాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది.