యాప్నగరం

గోవాలో అర్థరాత్రి నుంచి కంప్లీట్ లాక్ డౌన్

గోవా ప్రభుత్వ కీలక నిర్ణయం. అర్థరాత్రి నుంచి కంప్లీట్ లాక్ డౌన్ . పర్యాటకంపై పూర్తి నిషేధం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి అనుమతి నిరాకరణ.

Samayam Telugu 24 Mar 2020, 2:28 pm
దేశ వ్యాప్తంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ నడుస్తుంది. కరోనా మహమ్మారి మనదేశంలో శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఎక్కడికక్కడ ఈ వైరస్ వ్యాపించకుండా కట్టడి చర్యలు చేపట్టాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన గోవా రాష్ట్రం... అర్థరాత్రి నుంచి కంప్లీట్ లాక్ డౌన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ కుమార్ ప్రకటించారు. ఇవాల్టి అర్థరాత్రి నుంచి మార్చి 31 వరకు కంప్లీట్ షట్ డౌన్ అమలు చేస్తామన్నారు. ఇప్పటికే గోవాలో పర్యాటకంపై పూర్తి నిషేధం విధించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అనుమతి నిరాకరించారు. రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో పలువురు కరోనా వైరస్ బారిన పడినట్టు తేలడంతో ఇక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్నింటిని బంద్ చేస్తున్నట్లు గోవా సర్కార్ ప్రకటించింది.
Samayam Telugu goa cm


మరోవైపు ఇప్పటికే బీహార్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈనెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపాయి. దేశంలో కరోనా బారిన పడి ఇప్పటికే దేశ వ్యాప్తంగా పదిమంది చనిపోయారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 400 దాటి 5వందలకు చేరువలో ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ వైరస్ పట్ల తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు మోదీ సైతం ఇవాళ లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ రాత్రికి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచాారం. మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ ను కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.