యాప్నగరం

భార్యాభర్తల్ని విడదీసినందుకు కంప్యూటర్ సిగ్గుపడాలి..సుష్మా ఫన్నీ ట్వీట్

కేంద్రమంత్రి ఏంటి... భార్యాభర్తల్ని విడదీయడమేంటని షాకవ్వకండి. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఓ నెటిజన్ తనకు ఎదురైన ఇబ్బందిని సుష్మా దృష్టికి తెస్తూ చేసిన ట్వీట్ ఇది.

Samayam Telugu 14 May 2018, 4:15 pm
సుష్మా ఏంటి... భార్యాభర్తల్ని విడదీయడమేంటి... కంప్యూటర్‌కు ఏం సంబంధమని షాకవ్వకండి. ఓ నెటిజన్ తనకు ఎదురైన ఇబ్బందిని సుష్మా దృష్టికి తెస్తూ చేసిన ట్వీట్ ఇది. దానికి ఆమె చేసిన సరదా ట్వీట్ రిప్లై. అసలు స్టోరీలోకి వస్తే... బెంగళూరుకు చెందిన చందర్ నంది దంపతులు మానస సరోవర్ యాత్రకు ఎంపికయ్యారు. అయితే వారిద్దరు వేరు, వేరు బ్యాచ్‌లలో ఉన్నారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన చందర్ సుష్మా స్వరాజ్‌కు ఓ ట్వీట్ చేశారు. తామిద్దరం విడిపోయామని... ఇద్దర్ని ఒకే బ్యాచ్‌లో పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu Sushma


చందర్ చేసిన ట్వీట్‌పై సుష్మా స్వరాజ్ ఫన్నీగా స్పందించారు. మీ ఇద్దర్ని విడదీసినందుకు కంప్యూటర్ గిల్టీగా ఫీలవ్వాలంటూ... అయినా ఏమీ ఆందోళనపడకండి... ఒకే బ్యాచ్‌లో ఇద్దర్ని పంపిస్తామన్నారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. కంప్యూటర్ దంపతుల్ని విడదీసింది... సుష్మా గారు ఇద్దర్ని మళ్లీ కలిపారని కామెంట్స్ చేశారు. అలాగే వాళ్ల సమస్యను పరిష్కరించినందుకు కేందమంత్రిని అభినందిస్తున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.