యాప్నగరం

Monsoon Rains అరేబియాలో అనుకూల పరిస్థితి.. వచ్చే 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు: ఐఎండీ

దేశంలో జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయి. ఖరీఫ్ సీజన్‌లో 90 శాతం వర్షపాతానికి రుతుపవనాలే ఆధారం. జూన్ మొదటి వారంలో కేరళలోకి మొదటి ప్రవేశించి తర్వాత దేశమంతటికీ విస్తరిస్తాయి. అరేబియా సముద్రం గుండా కేరళ తీరాన్ని తాకి కర్ణాటక మీదుగా ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించి ఉత్తరాదికి వెళతాయి. నాలుగు నెలల పాటు ఇవి వర్షాన్ని ఇస్తాయి. తర్వాత ఈశాన్య రుతుపవనాలు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉంటాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 27 May 2022, 3:02 pm

ప్రధానాంశాలు:

  • మే 27న కేరళను రుతుపవనాలు తాకుతాయని అంచనా
  • ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
  • వచ్చే 48 గంటల్లో మరింత చురుకుగా నైరుతి రుతుపవనాలు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Picture used for representational purpose only
నైరుతి రుతుపవనాలకు (Southwest Monsoon) అనుకూలమైన వాతావరణం నెలకుందని, మరో రెండు మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) శుక్రవారం ప్రకటించింది. తొలుత మే 27నే రుతుపవనాలు కేరళను తాకుతాయని అంచనా వేశారు. కానీ, ప్రతికూల పరిస్థితులతో నైరుతి రుతుపవనాలు నెమ్మదించాయి. రాబోయే 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం మాల్దీవులు, లక్షద్వీప్‌ పరిసరాలతో పాటు కొమరిన్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది. దీంతో నైరుతి రుతుపవనాలు బలపడి కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
‘‘తాజా వాతావరణ సూచనల ప్రకారం.. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ గాలులు బలపడ్డాయి. ఉపగ్రహ ఫోటోలు ప్రకారం కేరళ తీరం.. దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ఆకాశం మేఘావృతమై ఉంది.. అందుకే పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.. వచ్చే 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయి.. తదుపరి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి.. అదే కాలంలో నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశిస్తాయి’’ అని వెల్లడించింది.

నైరుతి రుతుపవనాలు దక్షిణ శ్రీలంకను పూర్తిగా ఆవహించాయి. ఆరు రోజుల అనంతరం నైరుతి రుతుపవనాలు వేగంగా కేరళ వైపు పయనిస్తున్నాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ, ఈ ఏడాది ముందుగానే తాకనున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా రుతుపవనాలు గత నెలలో వేగం పుంజుకున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను ప్రకటించారు. ఉత్తర కోస్తా, యానంలలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఒకటి రెండు చోట్ల పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.