నకిలీ ఓటర్ కార్డుల కుంభకోణంతో వాయిదా పడిన ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ సీటు ఎన్నిక పోలింగ్ నేడు జరుగుతోంది. కర్ణాటకలో ఇటీవలే ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్లు ఈ ఎన్నికలో అమీతుమీ తలపడుతుండటమే ఆసక్తిదాయం. ఒకవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ పార్టీలు ఆర్ఆర్ నగర్లో మాత్రం ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. వీటికి తోడు భారతీయ జనతా పార్టీ పోటీలో ఉండనే ఉంది. ఇలా ఇక్కడ ప్రధానంగా త్రిముఖ పోరు జరుగుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్న జేడీఎస్, కాంగ్రెస్లు పోటీ నేపథ్యంలో ఈ సీటును ఎగరేసుకుపోవాలని బీజేపీ భావిస్తోంది.
ప్రస్తుత పరిణామాల్లో కర్ణాటకలో ప్రతి సీటు కూడా కీలకమే. కాంగ్రెస్, జేడీఎస్ల కూటమికి మినిమం మెజారిటీ కన్నా నాలుగైదు సీట్ల బలమే అదనంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీటును గెలుచుకోవడం ద్వారా కూటమి బలాన్ని మరో సీటు పెంచుకోవాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. అయితే దీని కోసం ఈ రెండు పార్టీలూ చేతులు కలపలేదు. దేనికది పోరాడుతున్నాయి. ఆర్ఆర్ నగర్లో ఇరు పార్టీల ఐక్యత కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది.
కాంగ్రెస్, జేడీఎస్ల అనైక్యత తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఆ పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే తమ అవకాశాలు దెబ్బతినేవని.. వేర్వేరుగా పోటీ చేయడం తమకే లాభదాయకం అని బీజేపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆర్ఆర్ నగర్ సీటుతో పాటు జయనగర్లో కూడా ఎన్నిక వాయిదా పడింది. వచ్చే నెల 11న జయనగర్ సీటు పోలింగ్ జరగనుంది.
ప్రస్తుత పరిణామాల్లో కర్ణాటకలో ప్రతి సీటు కూడా కీలకమే. కాంగ్రెస్, జేడీఎస్ల కూటమికి మినిమం మెజారిటీ కన్నా నాలుగైదు సీట్ల బలమే అదనంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీటును గెలుచుకోవడం ద్వారా కూటమి బలాన్ని మరో సీటు పెంచుకోవాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. అయితే దీని కోసం ఈ రెండు పార్టీలూ చేతులు కలపలేదు. దేనికది పోరాడుతున్నాయి. ఆర్ఆర్ నగర్లో ఇరు పార్టీల ఐక్యత కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది.
కాంగ్రెస్, జేడీఎస్ల అనైక్యత తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఆ పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే తమ అవకాశాలు దెబ్బతినేవని.. వేర్వేరుగా పోటీ చేయడం తమకే లాభదాయకం అని బీజేపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆర్ఆర్ నగర్ సీటుతో పాటు జయనగర్లో కూడా ఎన్నిక వాయిదా పడింది. వచ్చే నెల 11న జయనగర్ సీటు పోలింగ్ జరగనుంది.