యాప్నగరం

బెంగళూరుకు కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు

కర్ణాటక క్యాంపు రాజకీయాలు ముగిశాయి. శనివారం జరగనున్న బలపరీక్ష కోసం కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు మళ్లీ బెంగళూరుకు బయల్దేరుతున్నారు. ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోని హోటల్ గదుల్ని ఖాళీ చేసి మళ్లీ బస్సులెక్కారు.

Samayam Telugu 18 May 2018, 8:57 pm
కర్ణాటక క్యాంపు రాజకీయాలు ముగిశాయి. శనివారం జరగనున్న బలపరీక్ష కోసం కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు మళ్లీ బెంగళూరుకు బయల్దేరుతున్నారు. ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోని హోటల్ గదుల్ని ఖాళీ చేసి మళ్లీ బస్సులెక్కారు. రాత్రికి భాగ్యనగరంలోనే డిన్నర్ చేసుకొని రోడ్డు మార్గాన బెంగళూరు వెళుతున్నారు. అక్కడికి చేరుకోగానే ఎమ్మెల్యేలందర్ని నగర శివారులో ఉన్నో రిసార్టులోనే ఉంచనున్నారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి అక్కడి నుంచి తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu Bus..


బలపరీక్షలో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్‌లు ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. తాజ్ కృష్ణ హోటల్‌లో నిర్వహించిన సీఎల్పీ భేటీకి కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటూ జేడీఎస్ నేత కుమారస్వామి కూడా హాజరయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే సిద్ధరామయ్యను సీఎల్పీ నేతగా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అనంతరం కుమారస్వామి నోవాటెల్‌కు వెళ్లి జేడీఎస్ ఎమ్మెల్యేలను కలిసి వారితో మాట్లాడారు. అసెంబ్లీలో జరిగే బలపరీక్ష కీలకం కావడంతో ఎమ్మెల్యేలు జారిపోకుండా వారికి హితబోధ చేసినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.