యాప్నగరం

Congress Protest: సెప్టెంబరు 10న 'భారత్ బంద్'

పెరిగిన పెట్రో ధరల ద్వారా రూ. 11 లక్షల కోట్లు అదనంగా పొందిన కేంద్ర సర్కారు వెంటనే.. ఎక్సైజ్ సుంకాన్ని, అధికంగా ఉన్న వ్యాట్‌ను తగ్గించాలని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని అంటున్న కాంగ్రెస్ పార్టీ.

Samayam Telugu 7 Sep 2018, 11:23 am
పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సోమవారం (సెప్టెంబరు 10) 'భారత్ బంద్‌'కు పిలుపునిచ్చింది. ఈ సంధర్భంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఈ బంద్ కి మద్దతు తెలిపి సహకరించాలని కోరింది. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జి రణదీప్ సుర్జీవాలా.. పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతో సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని ఆపాలనే నెపంతో ఈ నెల 10న భారత్‌ బంద్‌కు పిలుపునివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
Samayam Telugu రణదీప్


పెరిగిన పెట్రో ధరల ద్వారా రూ. 11 లక్షల కోట్లు అదనంగా పొందిన కేంద్ర సర్కారు వెంటనే.. ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ను తగ్గించి; పెట్రోల్, డీజిల్ ధరలకు కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. దీని వల్ల సామాన్యుడికి కాస్త ఊరట కలుగుతుందని, ఈ బంద్‌ను ప్రతిపక్ష పార్టీలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.

మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతుండడం, ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రో ధరలు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు పెట్రో ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.