కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ లీక్ కావడం సంచలనంగా మారింది. అభ్యర్థుల జాబితా పేరుతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కలకలంరేపాయి. నిన్నటి నుంచి కొన్ని లిస్ట్లు ప్రత్యక్షం కావడంతో... అధిష్టానం షాక్ అవ్వగా... కర్ణాటక కాంగ్రెస్ నేతలు అయోమయానికి గురయ్యారు. విషయం పార్టీ పెద్దల వరకు వెళ్లడంతో దీనిపై నేతలు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఉన్న అభ్యర్థుల జాబితా నకిలీదని... సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటించలేదని తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా క్లైమాక్స్కు వచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై తుది చర్చలు కూడా పూర్తైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్రం ఎన్నికల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో... జాబితా ప్రకటన ఆలస్యమవుతోందట. ఇవాళో, రేపో కమిటీ సమావేశమై... లిస్ట్ను ఫైనల్ చేసే అవకాశం ఉంది.
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా క్లైమాక్స్కు వచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై తుది చర్చలు కూడా పూర్తైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్రం ఎన్నికల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో... జాబితా ప్రకటన ఆలస్యమవుతోందట. ఇవాళో, రేపో కమిటీ సమావేశమై... లిస్ట్ను ఫైనల్ చేసే అవకాశం ఉంది.