యాప్నగరం

మాకొద్దీ కిరణ్ బేడీ.. కాంగ్రెస్ నిరసన తీవ్రతరం!

పుదుచ్చేరి కాంగ్రెస్‌ ప్రభుత్వం, లెప్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ మధ్య ఘర్షణ పతాక స్థాయికి చేరింది..

TNN 8 Jul 2017, 3:25 pm
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని ఆ పదవి నుంచి తొలగించాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. శనివారం (జులై 8) పుదుచ్చేరి బంద్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే, వామపక్షాలతో పాటు కొంత మంది వ్యాపారులు, పౌరులు ఈ బంద్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలుచోట్ల కిరణ్ బేడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.
Samayam Telugu congress demans to sack kiran bedi from puducherry
మాకొద్దీ కిరణ్ బేడీ.. కాంగ్రెస్ నిరసన తీవ్రతరం!


పుదుచ్చేరి కాంగ్రెస్‌ ప్రభుత్వం, లెప్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ మధ్య ఘర్షణ పతాక స్థాయికి చేరింది. కిరణ్ బేడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. ఆమె బీజేపీ ఏజెంటులా పని చేస్తున్నారని స్వామి మండిపడ్డారు. మరోవైపు తాను యూనియన్ టెరిటరీస్ యాక్ట్ ప్రకారమే నడుచుకుంటున్నానని బేడీ పేర్కొన్నారు.

లెప్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ మంగళవారం.. కేంద్రం నామినేట్‌ చేసిన ముగ్గురు వ్యక్తులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించారు. ఆమె హడావిడిగా ప్రమాణ స్వీకారం చేయించడంపై నారాయణ స్వామి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శిస్తోంది. ఈ నియామకాలపై స్టే విధించాలంటూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.