యాప్నగరం

‘జనాలను పిచ్చోళ్లను చేయకండి.. వాస్తవాలు ఇవే..’ పెట్రోల్ ధరల తగ్గింపుపై కాంగ్రెస్ రియాక్షన్

Congress Reaction on Petrol Price Cut | కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం పట్ల కాంగ్రెస్ స్పందించింది. 2014 నాటితో పోలిస్తే భారీగా ఎక్సైజ్ డ్యూటీ పెంచిన మోదీ సర్కారు.. ఇప్పుడు తగ్గించింది కొంతేనని తెలిపింది. దమ్ముంటే ప్రజలకు ఊరట కలిగించేలా 2014 మే స్థాయికి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేసింది. గత 60 రోజుల్లో పెంచిన దాని కంటే ఇప్పుడు తగ్గించిందే తక్కువని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ తెలిపారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 21 May 2022, 8:32 pm

ప్రధానాంశాలు:

  • ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం
  • కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్ స్పందన
  • 60 రోజుల్లో పెంచిందే ఎక్కువన్న హస్తం పార్టీ నేత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Randeep surjewala
Congress party reaction on Petrol Price Cut
Congress Reaction on Petrol Price Cut | సామాన్యుడిపై పెట్రో భారం తగ్గించడం కోసం కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను చెప్పుకోదగ్గ మొత్తంలో తగ్గించిన సంగతి తెలిసిందే. ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌ ధర రూ.9.5, లీటర్ డీజిల్‌ ధర రూ.7 మేర తగ్గనుంది. కేంద్రం నిర్ణయంతో సామాన్యులకు ఊరట లభించనుంది. కాగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ తనదైన రీతిలో స్పందించింది. పెట్రోల్, డీజిల్‌పై ఈ 8 ఏళ్లలో భారీగా ఎక్సైజ్ సుంకాలను పెంచి.. ఇప్పుడు కొద్దిమేర తగ్గించారని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా (Randeep Singh Surjewala) వెల్లడించారు.
‘ఆర్థిక మంత్రి గారూ.. 2014 మే నెలలో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) రూ.9.48 పైసలు ఉండగా.. 2022 మే 21న అది రూ.27.90 పైసలకు చేరింది. ఇప్పుడేమో రూ.8 తగ్గించారు. మీ 8 ఏళ్ల పాలనలో ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ.18.42 పైసలు పెంచి ఇప్పుడు రూ.8 తగ్గించారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే ఇప్పటికీ ఎక్సైజ్ డ్యూటీ పది రూపాయలకుపైగా ఎక్కువే’ అని సుర్జేవాలా ట్వీట్ చేశారు.

దేశానికి కావాల్సింది కనికట్టుతో ప్రజలను మోసం చేయడం కాదు. దేశానికి కావాల్సింది గారడీ కాదు. 2014 మే స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలి. జనాలను మోసం చేయడం మానండి. మీ దమ్మేంటో చూపి ప్రజలకు ఊరటనివ్వండి’ అంటూ రణదీప్ ఘాటుగా ట్వీట్ చేశారు.

‘యూపీఏ ప్రభుత్వం దిగిపోయే నాటికి లీటర్ డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.3.56 పైసలు ఉండగా.. 2022, మే 21న అది రూ.21.80 పైసలు చేరింది. మీ హయాంలో లీటర్ డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.18.24 పైసలు పెంచి ఇప్పుడు లీటర్‌కు 6 రూపాయల మేర తగ్గించారు. కాంగ్రెస్ హయాం నాటితో పోలిస్తే ఇప్పటికీ డీజిల్‌పై ఎక్సైజ్ సుంకంలో వ్యత్యాసం రూ.15.80 V/S రూ.3.56గా (రూ.12కు పైగా) ఉంది’ అని సుర్జేవాలా ట్వీట్ చేశారు.

‘‘21 మార్చి 2022న లీటర్ పెట్రోల్ ధర (ఢిల్లీలో) రూ.95.41 ఉండగా.. నేడు (మే 21న) రూ.105.41గా ఉంది. ఈ 60 రోజుల్లో మీరు లీటర్‌కు రూ.10 పెంచారు. కానీ ఇప్పుడు రూ.9.50 పైసలు తగ్గించారు. జనాలను పిచ్చోళ్లను చేయకండి’’ అని సుర్జేవాలా ట్వీట్ చేశారు.

‘ఈ 60 రోజుల్లో డీజిల్ ధర (ఢిల్లీలో) రూ.86.67 పైసల నుంచి రూ.96.67కు చేరింది. అంటే లీటర్ డీజిల్ ధర 10 రూపాయలు పెంచి.. ఇప్పుడు రూ.7 తగ్గించారు’ అని కాంగ్రెస్ నేత ట్వీట్ చేశారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.