యాప్నగరం

ట్విస్ట్: నీరవ్ మోదీ నుంచి కాంగ్రెస్ నేత భార్యకు ఖరీదైన రత్నాలు!

నీరవ్ మోదీ వ్యవహారంలో మరో ట్విస్ట్ బయపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసిన నీరవ్ మోదీ కాంగ్రెస్ సీనియర్ నేత భార్యకు విలువైన వజ్రాలను అందించినట్లు దర్యాప్తులో గుర్తించారు.

TNN 18 Feb 2018, 9:44 am
నీరవ్ మోదీ వ్యవహారంలో మరో ట్విస్ట్ బయపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసిన నీరవ్ మోదీ కాంగ్రెస్ సీనియర్ నేత భార్యకు విలువైన వజ్రాలను అందించినట్లు దర్యాప్తులో గుర్తించారు. కాంగ్రెస్ సీనియర్ అభిషేక్ మను సింఘ్వి భార్య అనితా సింఘ్వికి నీరవ్ మోదీ నుంచి రూ.1.5 కోట్ల విలువైన నగలు అందినట్టు ఆయన కార్యాలయంలో జరిపిన సోదాల్లో బయటపడింది. అయితే, ఈ ఆరోపణలను అభిషేక్ సింఘ్వీ కొట్టిపారేశారు. అంతేకాదు ఇసుమంతైనా వాస్తవం లేదని స్పష్టం చేశారు. 2014 మే 20, 2014 ఆగస్టు 21, 2015 జనవరి 17 తేదీల్లో అనిత సింఘ్వి కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో నమోదైంది.
Samayam Telugu congress leader abhishek singhvis wife bought rs 1 5 crore gems from nimo
ట్విస్ట్: నీరవ్ మోదీ నుంచి కాంగ్రెస్ నేత భార్యకు ఖరీదైన రత్నాలు!


ట్యాక్స్ ఇన్వాయిస్‌లో అనితా సింఘ్వి పాన్ నంబరును ఉపయోగించడం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ మొత్తానికి చెక్ ద్వారా చెల్లింపు చేసినట్టు దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొత్తం లావాదేవీలను నీరవ్ మోదీ తన డైరీలో, ఆయన సిబ్బంది నిర్వహిస్తోన్న కంప్యూటర్లలో ‘లెక్కల్లోకి తీసుకోని పేమెంట్’గా పేర్కొనడం గమనార్హం. లెక్కలేని చెల్లింపులు జాబితాలో రూ.4.8 కోట్లు ఉన్నట్టు బయటపడింది.

ఈ ఆరోపణలపై అభిషేక్ స్పందిస్తూ.. అనిత నగలు కొన్నట్టు నా దృష్టికి రాలేదు.. అయితే ఆమె కొనుగోలు చేసినట్టు వేరేవారి కంప్యూటర్‌లో ఆధారాలు ఉన్నాయి వ కాబట్టి నిజమే అయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అయితే అది ఎలాంటి ప్రకటన అనే విషయం తనకు తెలియదని, తొలిసారి దీని గురించి వింటున్నానని పేర్కొన్నారు. తనపై బురద జల్లేందుకు కావాలనే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తోందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.