యాప్నగరం

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు కరోనా

Congress: కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌కు కరోనా సోకింది. పార్టీలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కరోనా బారినపడ్డారు.

Samayam Telugu 1 Oct 2020, 6:36 pm
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు గురువారం (అక్టోబర్ 1) ఆయన వెల్లడించారు. ఢిల్లీలోని తన నివాసంలోనే ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలిపారు. కొద్ది రోజులుగా తనను కాంటాక్ట్‌ అయినవాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.
Samayam Telugu అహ్మద్ పటేల్
Ahmed Patel


కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు వైరస్ బారినపడ్డారు. అభిషేక్‌ సింఘ్వీకి కూడా కరోనా సోకింది. అంతేకాకుండా కేంద్రంలో 10 మందికి పైగా మంత్రులు కరోనా బారినపడ్డారు. అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీకి కూడా కరోనా సోకింది. చికిత్స అనంతరం వారు కోలుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కూడా రెండు రోజుల కిందట కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Also Read: ఈ దేశంలో నడిచే హక్కు కూడా లేదా: రాహుల్ గాంధీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.