యాప్నగరం

MP Crisis: బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి కమల్ నాథ్ రాజీనామా

మధ్యప్రదేశ్‌లో బల నిరూపణకు ముందే కమల్ నాథ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 20 Mar 2020, 2:01 pm
ఊహించిందే జరిగింది. మధ్యప్రదేశ్ సీఎం పదవికి కాంగ్రెస్ నేత కమల్ నాథ్ రాజీనామా చేశారు. సుప్రీం ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. దానికి కొద్ది గంటల ముందు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. బెంగళూరులో తమ ఎమ్మెల్యేలను నిర్బంధంలో ఉంచారని ఆరోపించిన కమల్ నాథ్.. తన సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ‘నిజం బయటకు వస్తుంది.. జనం వాళ్లను క్షమించరు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
Samayam Telugu kamal-nath-bccl


ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు సహా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీపై తిరుగుబాటు చేశారు. వీరిని బుజ్జగించి వెనక్కి రప్పించడంలో కమల్ నాథ్ విఫలమయ్యారు.
15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో సింధియా కీలక పాత్ర పోషించారు. కానీ స్వల్ప మెజార్టీ రావడంతో ఆయనకు సీఎం పదవి దక్కలేదు. పీసీసీ చీఫ్ పదవి, రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కకుండా కమల్ నాథ్, దిగ్విజయ్ అడ్డుకోవడంతో సింధియా అదును చూసి బీజేపీలో చేరారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 మంది సభ్యులు ఉండగా.. కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో ఆ పార్టీ బలం 92కు పడిపోయింది. బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు 104 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిపోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.