యాప్నగరం

భారతదేశ పరిస్థితి శ్రీలంకలా కనిపిస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. మన దేశంలో కూడా నిరుద్యోగం, మతపరమైన హింస, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. రెండు దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలపై గ్రాఫ్‌లను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కాగా ప్రస్తుతం శ్రీలంకలో దారుణమైన పరిస్థితులున్నాయి. అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో.. ప్రజలు ఆందోళనకు దిగారు. అక్కడి ప్రధాని కూడా రాజీనామా చేశారు. అక్కడ జరుగుతున్న అల్లర్లకు కొంతమంది చనిపోయారు. చాలామందికి గాయాలయ్యాయి.

Authored byAndaluri Veni | Samayam Telugu 18 May 2022, 8:42 pm
భారత దేశం మరో శ్రీలంక అవుతుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో చాలా రకాల సమస్యలున్నాయన్నారు. ఇంధన ధరలు పెరుగుదలతో పాటు నిరుద్యోగం, మతపరమైన హింస, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా శ్రీలంక దేశ ఆర్థిక వ్యవస్థతో... మన దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పోలుస్తూ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకేలా కనిపిస్తున్నాయన్నారు.
Samayam Telugu రాహుల్ గాంధీ


నిరుద్యోగం, పెట్రో ఉత్ప‌త్తులు, మ‌త క‌ల్లోలాల విష‌యంలో శ్రీలంక ప‌రిస్థితి, భార‌త్ ప‌రిస్థితి ఒకే ర‌కంగా వుంద‌ని రాహుల్ ఆరోపించారు. భారతదేశం శ్రీలంక లాగా కనిపిస్తోందని, కేంద్రం ఇలాంటి తీవ్రమైన సమస్యల నుంచి ప్రజలను మళ్లించకూడదని రాహుల్ గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలా మళ్లించిన నిజాలు మారిపోవని అన్నారు. "ప్రజలను దృష్టి మరల్చడంతో వాస్తవాలు మారవు. భారత్‌ చాలా శ్రీలంకలా కనిపిస్తోంది" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో రెండు దేశాలను పోలిస్తూ మూడు గ్రాఫ్‌లను జత చేశారు. ఈ ట్వీట్‌కు ఆయన మూడు గ్రాఫ్‌లను జత చేశారు.


ఇరు దేశాల్లో కూడా 2017 నుంచి నిరుద్యోగిత పెరిగిపోయిందని... 2020 నాటికి గరిష్ట స్థాయికి పెరిగిందని రాహుల్ ఈ గ్రాఫ్‌లో చూపించారు. ఇక పెట్రో ధ‌ర‌లను కూడా రాహుల్ గ్రాఫ్‌లో చూపించారు. కాగా శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని చూస్తోందని, అదే వ్యతిరేక నిరసనలకు దారితీసింది. విదేశీ మారకద్రవ్యం కొరత, కోవిడ్ కారణంగా పర్యాటక రంగం దెబ్బతింది. దీంతో ధరలు అధికంగా పెరగడం, నిరుద్యోగంతో శ్రీలంక కుదేలైంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అల్లర్లకు తొమ్మిది మంది చనిపోయారు. సుమారు 300 మంది గాయపడ్డారు. ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన రాజీనామా చేయగా.. రణిల్ విక్రమసింఘే కొత్త ప్రధానిగా నియమితులయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.