యాప్నగరం

రాహుల్‌.. పప్పు అంటూ పొగిడిన కాంగ్రెస్ నేత

రాహుల్ గాంధీని ‘పప్పు’ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేత ఒకర్ని పార్టీ నుంచి తొలగించారు.

TNN 14 Jun 2017, 12:54 pm
రాహుల్ గాంధీని ‘పప్పు’ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేత ఒకర్ని పార్టీ నుంచి తొలగించారు. ఇటీవల మధ్యప్రదేశ్ లోని మందసౌర్ లో రైతుల ఆందోళనలో ఐదుగురు చనిపోయారు. ఈ ప్రాంతంలో రాహుల్ పర్యటించారు. రాహుల్ పర్యటనను వ్యంగ్యంగా పొగడుతూ మీరట్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షడు వినయ్ ప్రధాన్.. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ వాట్సాప్ గ్రూప్ లో కామెంట్ చేశారు.
Samayam Telugu congress leader vinay pradhan calls rahul gandhi pappu fired
రాహుల్‌.. పప్పు అంటూ పొగిడిన కాంగ్రెస్ నేత


‘పప్పు (రాహుల్ గాంధీ) ఆదానీ, అంబానీ, మాల్యాలతో చేతులు కలపొచ్చు కానీ ఆయన అలా చేయలేదు. పప్పు ప్రధానమంత్రి, కేంద్రమంత్రి అవ్వొచ్చు కానీ ఆయన ఆ మార్గంలో వెళ్లలేదు. వీటికి బదులుగా ఆయన మంద్ సౌర్ లో రైతులకు అండగా నిలిచారు’ అంటూ వాట్సాప్ మెస్సేజ్ పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.

వినయ్ ప్రధాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన్ వ్యవహారంపై క్రమశిక్షణ సంఘం భేటీ అయ్యి.. ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నాయకత్వానికి మచ్చ తెచ్చేలా ప్రధాన్ వ్యాఖ్యలున్నాయి. ఈ కుట్రలో ఇతర పార్టీల హస్తం ఉన్నట్లు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ రైతుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారని క్రమశిక్షణ సంఘం మండిపడింది.

అయితే వినయ్ ప్రధాన్ మాత్రం.. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని చెబుతున్నారు. ఎవరో ఫొటోషాప్ ద్వారా తన ఫొటోను ఉపయోగించి.. తనను పావుగా వాడుకుంటున్నారని అన్నారు. తన వివరణ వినకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, రాహుల్ గాంధీ అంటే తనకు ఎంతో గౌరవముందని చెప్పారు. రాహుల్ ను కలిసి వివరణ ఇస్తానని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.