కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ .. అని రాజకీయ వర్గాలు లెక్కేసిన రెండు స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. నంజనగూడ, గుండ్లుపేట.. ఈ రెండు నియోజకవర్గాలకూ ఉప ఎన్నికలు జరిగాయి. వీటిల్లో విజయం కోసం భారతీయ జనతా పార్టీ చాలానే కష్టపడింది. ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో కమలం పార్టీలోకి కర్ణాటకలో బోలెడన్ని చేరికలు జరిగాయి. ముఖ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ కమలం తీర్థం పుచ్చుకున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పని చేసిన ఈయనను చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీకి బీజేపీ గట్టి షాకే ఇచ్చింది.
కృష్ణ చేరికతో రాజకీయ, కుల సమీకరణాలు కమలానికి అనుకూలంగా మారాయయనే అభిప్రాయాలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ నేతలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయం సాధిస్తామని సవాళ్లు విసిరారు. కాంగ్రెస్ పతనానికి ఈ ఉప ఎన్నికలు నాంది అవుతాయని అన్నారు. అయితే రెండు చోట్లా కమలం పార్టీ గుడ్లు తేలేసింది.
గుండ్లుపేట లో సిట్టింగ్ ఎమ్మెల్యే మహదేవ ప్రసాద్ మరణంతో ఆయన భార్య కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆమె 4,500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ నుంచి చాలా సార్లు పోటీ చేసి ఓడిన బీజేపీ నేత నిరంజన్ కుమార్ మరోసారి ఓటమిని మూటగట్టుకున్నాడు. ఇక నంజనగూడు నుంచి ప్రాతినిధ్యం వహించిన వీ శ్రీనివాస ప్రసాద్ ను ఇటీవల సిద్ధరామయ్య మంత్రి వర్గం నుంచి తొలగించాడు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరి.. ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.
నంజనగూడు నుంచి బీజేపీ విజయం ఖాయమనే మాటలు వినిపించాయి. పోలింగ్ తర్వాత కూడా విజయం బీజేపీని వరిస్తుందనే అన్నారు. అయితే... ఫలితం మాత్రం మరో రకంగా ఉంది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నిహితుడు కేశవమూర్తి విజయం ఖాయమైంది.
సెమీస్ గా భావించిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించేసరికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక విభాగం అమితోత్సాహంతో ఉంది. ఓటమి తప్పదు అనుకున్న నియోజకవర్గంలో విజయం సాధించే సరికి.. కర్ణాటకలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ విజయంపై కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ చేరికతో రాజకీయ, కుల సమీకరణాలు కమలానికి అనుకూలంగా మారాయయనే అభిప్రాయాలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ నేతలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయం సాధిస్తామని సవాళ్లు విసిరారు. కాంగ్రెస్ పతనానికి ఈ ఉప ఎన్నికలు నాంది అవుతాయని అన్నారు. అయితే రెండు చోట్లా కమలం పార్టీ గుడ్లు తేలేసింది.
గుండ్లుపేట లో సిట్టింగ్ ఎమ్మెల్యే మహదేవ ప్రసాద్ మరణంతో ఆయన భార్య కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆమె 4,500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ నుంచి చాలా సార్లు పోటీ చేసి ఓడిన బీజేపీ నేత నిరంజన్ కుమార్ మరోసారి ఓటమిని మూటగట్టుకున్నాడు. ఇక నంజనగూడు నుంచి ప్రాతినిధ్యం వహించిన వీ శ్రీనివాస ప్రసాద్ ను ఇటీవల సిద్ధరామయ్య మంత్రి వర్గం నుంచి తొలగించాడు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరి.. ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.
నంజనగూడు నుంచి బీజేపీ విజయం ఖాయమనే మాటలు వినిపించాయి. పోలింగ్ తర్వాత కూడా విజయం బీజేపీని వరిస్తుందనే అన్నారు. అయితే... ఫలితం మాత్రం మరో రకంగా ఉంది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నిహితుడు కేశవమూర్తి విజయం ఖాయమైంది.
సెమీస్ గా భావించిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించేసరికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక విభాగం అమితోత్సాహంతో ఉంది. ఓటమి తప్పదు అనుకున్న నియోజకవర్గంలో విజయం సాధించే సరికి.. కర్ణాటకలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ విజయంపై కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.